మహేశ్‌ నన్ను హత్తుకున్నాడు.. కారణం మీరే!

ఇది తనకు మరో మర్చిపోలేని సంక్రాంతని దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనిల్‌ భావోద్వేగంతో ట్విటర్‌లో.....

Published : 29 Feb 2020 15:27 IST

అనిల్‌ రావిపూడి

హైదరాబాద్‌: ఇది తనకు మరో మర్చిపోలేని సంక్రాంతని దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనిల్‌ భావోద్వేగంతో ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘ఈ ప్రయాణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. సూపర్‌స్టార్‌తో జర్నీ బాక్సాఫీసు వద్ద 50 రోజుల్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. ఇందులోని డైలాగ్‌లు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్నాయి. మీరు (ప్రేక్షకులు) కడుపుబ్బా నవ్వుకోవడం వల్ల మేం బాక్సాఫీసు వద్ద వసూళ్లను ఎంజాయ్‌ చేస్తున్నాం. పంపిణీదారులు పెట్టుబడిగా పెట్టిన ప్రతి రూపాయికి అదనంగా మరో రూపాయి సంపాదించుకున్నారు. మీ వల్ల మా నిర్మాత లాభాల్ని చూశారు. నాపై ఎంతో నమ్మకం ఉంచిన మహేశ్‌బాబు నన్ను గర్వంగా హత్తుకున్నారు. మీరంతా కలిసి 2020 సంక్రాంతి మర్చిపోలేని పండగ చేశారు. ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరు.. ధన్యవాదాలు’ అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు మహేశ్‌తో ఆప్యాయంగా దిగిన ఫొటోను పంచుకున్నారు.

అదేవిధంగా అగ్ర నటి విజయశాంతికి కూడా అనిల్‌ థాంక్స్‌ చెప్పారు. ‘విజయశాంతితో కలిసి పనిచేయడం ఓ మధురమైన జ్ఞాపకం. మిమ్మల్ని తిరిగి వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడ్ని నేను కావడం గౌరవంగా ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’లో నటన.. మీ ప్రతిభ ఎప్పటికీ శాశ్వతమైందని నిరూపించింది’ అని ఆయన పేర్కొన్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని