అడవిలో రజనీ సాహసాలు.. వీడియో చూడండి!

డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే పాపులర్‌ కార్యక్రమం ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో సూపర్‌స్టార్ రజనీకాంత్ సందడి చేయబోతున్నారు. షో వ్యాఖ్యాత బేర్ గ్రిల్స్‌తో కలిసి రజనీ వన్యప్రాణులున్న అడవిలో తిరిగారు. ఈ కార్యక్రమం షూటింగ్‌ కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక వచ్చారు. కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్....

Updated : 17 Oct 2022 16:13 IST

‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షో కోసం..

చెన్నై: డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో సూపర్‌స్టార్ రజనీకాంత్ సందడి చేయబోతున్నారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి రజనీ అటవీప్రాంతంలో తిరిగారు. ఈ కార్యక్రమం షూటింగ్‌ కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక వచ్చారు. కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిత్రీకరణ జరిగింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను డిస్కవరీ ఛానల్‌ సోమవారం విడుదల చేసింది. ఇందులో రజనీ కొండలు ఎక్కుతూ, నీటిలో ఈదుతూ.. సాహసాలు చేస్తూ కనిపించారు. ‘ఇది నిజమైన సాహసం..’ అంటూ తన ఫీలింగ్‌ చెప్పారు.

సూపర్‌స్టార్‌ ఉత్సాహం చూసి బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసించారు. తలైవాతో కలిసి పనిచేయడం గురించి ఆయన ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌ ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటారని, ఆయన ప్రతి ఛాలెంజ్‌ను గొప్పగా స్వీకరించారని అన్నారు. దీంతో ఆయనపై గౌరవం మరింత పెరిగిందని చెప్పారు. మార్చి 23న రాత్రి 8 గంటలకు ఈ షో ప్రసారం కాబోతోంది. ‘మ్యాన్‌ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్ అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ... సాహసాలు చేస్తుంటారు. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో కనిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని