టాలీవుడ్పై కన్నేసిన ముంబయి బ్యూటీలు
బాలీవుడ్ భామలు టాలీవుడ్పై కన్నేశారు. అక్కడ సత్తా చాటుకున్న ముద్దుగుమ్మలు ఇక్కడ కూడా అదృష్టం పరీక్షించుకోవడానికి సుముఖత చూపుతున్నారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు మార్కెట్ పెరగడం వల్ల హిందీలో బిజీ ఉన్న భామలు సైతం తెలుగు ప్రాజెక్టుకు సంతకం చేస్తున్నారు.....
గాలి ఇటు మళ్లింది..
బాలీవుడ్ భామలు టాలీవుడ్పై కన్నేశారు. అక్కడ సత్తా చాటుకున్న ముద్దుగుమ్మలు ఇక్కడ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు మార్కెట్ పెరగడంతో హిందీలో బిజీ ఉన్న భామలు సైతం తెలుగు ప్రాజెక్టులకు సంతకం చేస్తున్నారు. కష్టపడి తెలుగు భాష, యాసను నేర్చుకుంటున్నారు. అంతేకాదు కొందరు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నారు. కథ, పాత్రల డిమాండ్ను బట్టి టాలీవుడ్ దర్శక, నిర్మాతలు వారివైపు మొగ్గుచూపుతున్నారు. త్వరలో మరికొందరు బ్యూటీలు తెలుగు వారిని పలకరించబోతున్నారు. వారిని ఓసారి చూద్దాం..
కోరి మరీ..
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’లో బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్కు జోడీగా సీత పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. హిందీలో ఫాంలో ఉన్న ఈ భామ రాజమౌళి నుంచి ఆఫర్ రాగానే ఎగిరి గంతేసి మరీ సంతకం చేశారు. ‘బాహుబలి’ చూసిన తర్వాత రాజమౌళితో కలిసి పనిచేయాలని అనిపించిందని ఆలియా ఓసారి చెప్పారు. అనుకోకుండా ఓసారి విమానాశ్రయంలో రాజమౌళిని కలిశానని, తన ఆసక్తి గురించి చెప్పానని అన్నారు. చిన్న పాత్రకైనా ఓకేనని ఆమె చెప్పడంతో ‘ఆర్.ఆర్.ఆర్’లో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం కోసం ఆమె తెలుగు కూడా నేర్చుకుంటున్నారట. ఇదే సినిమాలో ఎన్టీఆర్ ప్రియురాలిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. 2021 జనవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
విజయ్ ప్రేమ కోసం..
ఈ ఏడాది రూపొందుతోన్న మరో క్రేజీ సినిమా ‘ఫైటర్’ (పరిశీలనలో ఉన్న టైటిల్). పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా కోసం బాలీవుడ్ భామలను జల్లెడ పట్టారు. తొలుత జాన్వి కపూర్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత దిశా పటానీని కలిస్తే, ఆమె నో చెప్పారట. చివరికి అనన్య పాండే ప్రాజెక్టుకు సంతకం చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన 40 రోజుల షూటింగ్ ముంబయిలో జరిగింది. అలా ఈ ఏడాది మరో కొత్త మోము తెలుగు తెరపై కనిపించబోతోంది. అనన్య ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘పతి పత్ని ఔర్ ఓ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రభాస్ ప్రేయసిగా..
బాలీవుడ్లో నటిగా నిలదొక్కుకున్న శ్రద్ధా కపూర్ గతేడాది తొలిసారి తెలుగు తెరపై మెరిశారు. ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ సినిమా ‘సాహో’లో నటించారు. ఈ సినిమాలో అమృతగా మెప్పించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా యాక్షన్ థ్రిల్లర్గా పర్వాలేదనిపించింది. శ్రద్ధ నటించిన ‘బాఘి 3’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైగర్ ష్రాఫ్ కథానాయకుడు. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల కంటే ఎక్కువ రాబట్టినట్లు అంచనా వేశారు.
పవన్ కోసం..
రెండేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్న ఈ చిత్రం కోసం హిందీ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాదు హిందీ నటుడు అర్జున్ రాంపాల్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ‘సాహో’లోని ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ తెలుగు వారికి కనిపించారు.
బాక్సర్కు జతగా..
‘గద్దలకొండ గణేష్’ తర్వాత వరుణ్తేజ్ బాక్సర్ అవతారం ఎత్తారు. ఆయన హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం కోసం వరుణ్ ముంబయిలోని నిపుణుల వద్ద మూడు నెలలపాటు బాక్సింగ్లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తయింది. నవీన్ చంద్ర, నదియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ నటించబోతున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సల్మాన్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘దబాంగ్ 3’తో సయీ పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
వరుస ఆఫర్లు..
‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు వారిని పలకరించిన కియారా అడ్వాణీ ఆపై ‘వినయ విధేయ రామ’లో కనిపించారు. దీని తర్వాత బాలీవుడ్లో బిజీ అయిన ముద్దుగుమ్మ మరోసారి మహేశ్బాబు సరసన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. ఇందులో కథానాయికగా కియారాను తీసుకోమని మహేశ్ సతీమణి నమ్రత దర్శక, నిర్మాతలకు సిఫార్సు చేశారట.
‘డీజే’ తర్వాత టాలీవుడ్లో పూజా హెగ్డే జోరు పెరిగింది. వరుస సినిమాలు, విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘అల వైకుంఠపురములో..’ సందడి చేసిన ఆమె ఇప్పుడు ప్రభాస్ సరసన నటిస్తున్నారు. వింటేజ్ ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’లో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఈ భామ తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకొంటున్నారు.
ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’లో తెలుగులో మెరిసిన కంగనా రనౌత్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకు ఓటు వేస్తున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న ‘తలైవి’లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇటీవల ఫస్ట్లుక్ను కూడా విడుదల చేశారు. ఇందులో ఎంజీఆర్గా అరవింద్ స్వామి నటిస్తున్నారు.
సుధీర్బాబు ‘సమ్మోహనం’తో తెలుగు వారిని పలకరించిన బాలీవుడ్ భామ అదితిరావు హైదరి. తొలి సినిమాతో గుర్తింపు పొందిన ఆమె ‘వి’లో కనిపించనున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్బాబు ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందుతోంది. మార్చి 25న చిత్రం విడుదల కాబోతోంది. జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?