ఎన్నేళ్లకెన్నేళ్లకు వస్తున్నారమ్మా..!
ఒకప్పుడు తెలుగు వారిని అలరించి కనుమరుగైన ముద్దుగుమ్మలు ఇప్పుడు మళ్లీ మన తెరపై తళుక్కుమనబోతున్నారు. సరైన కథతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శ్రుతి హాసన్, ప్రియమణి, అంజలి, అమలాపాల్ తదితరులు చాలా రోజుల విరామం తర్వాత టాలీవుడ్ సినిమాకు .....
రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి బ్యూటీలు
ఒకప్పుడు తెలుగు వారిని అలరించి కనుమరుగైన ముద్దుగుమ్మలు ఇప్పుడు మళ్లీ మన తెరపై తళుక్కుమనబోతున్నారు. సరైన కథతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శ్రుతి హాసన్, ప్రియమణి, అంజలి, అమలాపాల్ తదితరులు చాలా రోజుల విరామం తర్వాత టాలీవుడ్ సినిమాకు సంతకం చేశారు. ఒకప్పుడు ఫాంలో ఉన్న వీరు విరామం తర్వాత నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి వీరు అంచనాల్ని ఏ మాత్రం అందుకుంటారో చూడాలి.
శ్రుతి హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా అందరికీ పరిచయమైనా టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. ‘గబ్బర్ సింగ్’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’, ‘ప్రేమమ్’ వంటి హిట్లు అందుకున్నారు. 2017లో వచ్చిన పవన్కల్యాణ్ ‘కాటమరాయుడు’ తెలుగులో ఆమె చివరి సినిమా. దీని తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మూడేళ్ల తర్వాత ఓ చిత్రానికి సంతకం చేశారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలో ఆమె కథానాయికగా కనిపించబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రియమణి
‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘శంభో శివ శంభో’, ‘గోలీమార్’, ‘రగడ’ వంటి హిట్స్లో సందడి చేసిన భామ ప్రియమణి. 2013లో వచ్చిన ‘చండీ’లో చివరిసారి తెలుగు తెరపై కనిపించారు. ఆపై 2016 ప్రకాష్రాజ్ ‘మన ఊరి రామాయణం’లో ప్రత్యేక పాత్రలో మెరిశారు. ఇన్నేళ్లకు తెలుగులో ‘విరాటపర్వం’ సినిమాకు సంతకం చేశారు. అంతేకాదు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లోనూ నటిస్తున్నారు. వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’లో కథానాయిక పాత్ర కోసం ప్రియమణిని సంప్రదించినట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
అంజలి
కోలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ రాణిస్తున్న బ్యూటీ అంజలి. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘బలుపు’, ‘గీతాంజలి’, ‘డిక్టేటర్’ వంటి సినిమాల్లో సందడి చేశారు. 2017 ‘చిత్రాంగద’ తర్వాత నేరుగా తెలుగు సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు ‘నిశ్శబ్దం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో అంజలి పోలీసు అధికారిగా కనిపించబోతున్నారు. ఈ మధ్య ఆమె పాత్రల కోసం జిమ్లో కసరత్తులు చేసి నాజూకుగా తయారయ్యారు. అదేవిధంగా ‘ఆనంద భైరవి’లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ 106వ సినిమాలోనూ అంజలి నటించబోతున్నట్లు సమాచారం.
అమలాపాల్
విభిన్న కథలతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అమలాపాల్. ఆమె కెరీర్ మాలీవుడ్లో మొదలైనప్పటికీ కోలీవుడ్, టాలీవుడ్లోనూ రాణించారు. ఇక్కడ ‘బెజవాడ’తో నటిగా అరంగేట్రం చేశారు. ఆపై ‘లవ్ ఫెయిల్యూర్’, ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో..’, ‘జెండాపై కపిరాజు’ సినిమాల్లో నటించారు. దీని తర్వాత ఆమె తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. కానీ 2015 నుంచి అమలాపాల్ టాలీవుడ్లో సంతకం చేయలేదు. ఇన్నేళ్లకు ఇటీవల ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెట్ఫ్లిక్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారట. మొదటి భాగానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగిలిన భాగాల్ని తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, సందీప్రెడ్డి వంగా డైరెక్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
కత్రినా కైఫ్
బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ ‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యారు. 2005లో బాలకృష్ణ ‘అల్లరి పిడుగు’లో నటించారు. ఆపై హిందీ సినిమాలతో బిజీగా గడిపిన కత్రినా ఇన్నాళ్లకు తెలుగు సినిమాకు సంతకం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ 21వ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నారు. కమర్షియల్ డ్రామాగా రూపొందించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారట. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినిదత్ నిర్మించబోతున్నారు. ఇందులో కథానాయిక పాత్ర కోసం కత్రినా కైఫ్ను అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం నిజమైతే ఇది కత్రినా రీఎంట్రీ అవుతుంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్చరణ్ బర్త్డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు