మన హీరోలు ఒక్కొక్కరుగా రావట్లేదుగా..!
కథానాయకుడు ఓ పాత్ర పోషించడమే ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటిది రెండు, అంత కంటే ఎక్కువ చేయాలంటే.. దానికి ఎంతో శ్రమ కావాలి. ఎన్నో కాస్ట్యూమ్స్, టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓ పాత్రకి మరో పాత్రకి తేడా స్పష్టంగా చూపించాలి. ఏ విధంగా చెప్పాలంటే సినిమా భారం.....
బాలకృష్ణ, రామ్, విక్రమ్..
కథానాయకుడు ఓ పాత్ర పోషించడమే ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటిది రెండు, అంత కంటే ఎక్కువ చేయాలంటే.. దానికి మరింత కష్టపడాలి. ఎన్నో కాస్ట్యూమ్స్, టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓ పాత్రకి మరో పాత్రకి తేడా స్పష్టంగా చూపించాలి. సినిమా భారం మొత్తం భుజాల మీద వేసుకుని మోయాలి. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాత్రలు, షేడ్స్ పోషించిన హీరోలు చాలా మందే ఉన్నారు. రానున్న రోజుల్లోనూ మన హీరోలు ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో సందడి చేయబోతున్నారు. బాలకృష్ణ, రామ్, విక్రమ్ తదితరులు తమ తర్వాతి ప్రాజెక్టులో ఒకటి కంటే ఎక్కువ పాత్రలు చేయబోతున్నారట. వారివైపు ఓ సారి చూద్దాం..
రామ్ రెడ్
‘ఇస్మార్ట్ శంకర్’లాంటి బ్లాక్బస్టర్ తర్వాత రామ్ మరో విభిన్న కథను ఎంచుకున్నారు. కోలీవుడ్లో సూపర్హిట్గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ను ‘రెడ్’ టైటిల్తో రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు తన స్టైల్లో అందిస్తున్నారు. ఇందులో ఆయన సిద్ధార్థ్, ఆదిత్యగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన లభించింది. రామ్ రెండు విభిన్న పాత్రల్లో చక్కటి వ్యత్యాసం చూపించారు. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరోమారు..
నందమూరి బాలకృష్ణ ఇప్పటికే పలుమార్లు ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇప్పుడు మరోసారి రెండు పాత్రల్లో కనిపించి, వినోదం పంచబోతున్నారట. ఆయన హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు ప్రచారం ఉంది. ఈ చిత్రంలో అంజలి, శ్రియలను కథానాయికలుగా అనుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలి. ఒక పాత్రలో అఘోరగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. కరోనా నేపథ్యంలో చిత్ర షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఏకంగా ఏడు..
కథానాయకుడు విక్రమ్ మరోసారి తనలోని ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన ఇప్పటికే పలు చిత్రాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించారు. కాగా ఇప్పుడు ‘కోబ్రా’ సినిమాలో ఏడు పాత్రల్లో కనిపించి వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. విక్రమ్ ప్రతి పాత్రకీ అద్భుతమైన వ్యత్యాసం చూపించారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడింది.
ఇద్దరు మహేశ్లు నిజమేనా?
మహేశ్బాబు రెండు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఆయన హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘బాషా’ తరహాలో ఈ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఓ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారంటూ టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
ఒకరా? ఇద్దరా?
రవితేజ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్న కొత్త చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు ఇటీవలే పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రాజకీయాంశాలతో ముడిపడిన కథతోనే ఆ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రవితేజా ఒకరా? ఇద్దరా? అనే సందేహం కలిగేలా పాత్ర ఉంటుందట.
వరుసగా..
తమిళ స్టార్ విజయ్కు ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. ఆయన ఇప్పటికే అనేక చిత్రాల్ల్లో విభిన్న పాత్రల్లో సందడి చేశారు. ‘మెర్సల్’లో మూడు పాత్రల్లో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘విజిల్’లోనూ అలానే మెప్పించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. త్వరలో ఆయన నటించిన ‘మాస్టర్’ చిత్రం రాబోతోంది. ఇందులోనూ విజయ్ రెండు షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్