కరోనాపై సినీ తారలు ఏం చెబుతున్నారు?

కరోనా వైరస్‌ నేపథ్యంలో థియేటర్లు మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. సినీ తారలు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడేందుకు తమ వంతు సాయంగా సామాజిక మాధ్యమాల

Updated : 17 Mar 2020 15:36 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో థియేటర్లు మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. సినీ తారలు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడేందుకు తమ వంతు సాయంగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎలా మసలు కోవాలి? ఇంట్లో ఉంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఇలా అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటూ, అవగాహన కల్పిస్తున్నారు.

దేశంలో కరోనా తీవ్రత పెరగకుండా ఉండేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా పలువురు సినీ నటులు, దర్శకులు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రత్యేక వీడియో విడుదల చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరు సూత్రాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జార్జియాలో సినిమా చిత్రీకరణలో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్ స్టా ద్వారా తన సందేశాన్ని ప్రకటించారు. ప్రజల ఆరోగ్య భద్రతపై ఆలోచించాల్సిన సమయమిదని, ప్రతి ఒక్కరు కరోనా విషయంలో కీలకంగా వ్యవహరించాలని ప్రభాస్ విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి తాళం వేసి సిబ్బందికి సెలవు ప్రకటించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పూరీ కనెక్ట్స్ లో ఎలాంటి ఆఫీసు పనులు, ప్రొడక్షన్ పనులు చేయకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కరోనాపై యుద్ధంలో గెలవాలంటే సమిష్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ నెల 19న జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకలను ముందస్తుగానే రద్దు చేసుకున్నారు. అలాగే తన విద్యాసంస్థల వార్షికోత్సవాన్ని కూడా వాయిదా వేసినట్లు ప్రకటించారు. కరోనా వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మానవత్వాన్ని చాటుకొని ఒకరినొకరు కాపాడుకోవాలని తమిళనటుడు విజయ్ సేతుపతి కోరారు. రితో పాటు, అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, కాజల్‌, అదాశర్మ, శిల్పాశెట్టి, సమీరారెడ్డి, అనుపమ్‌ఖేర్‌, సుమ, మంచు మనోజ్‌ ఇలా పలువురు సినీ తారలు తమ అభిమానులకు జాగ్రత్తలు చెబుతున్నారు. 











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని