జనతా కర్ఫ్యూ: అభిమానులకు ఎన్టీఆర్ పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు సినీ ప్రముఖులు ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్టీఆర్, రాజశేఖర్ మద్దతు తెలిపారు. అంతేకాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోషల్మీడియా వేదికగా ప్రజలను కోరారు. ఇప్పటివరకూ మందులేని కరోనా వైరస్ రోగం నుంచి రక్షించుకోవడానికి....
ఐకమత్యంగా విజయవంతం చేద్దాం..
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు సినీ ప్రముఖులు ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్టీఆర్, రాజశేఖర్, బోయపాటి శ్రీను తదితరులు మద్దతు తెలిపారు. అంతేకాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోషల్మీడియా వేదికగా అభిమానులను, ప్రజలను కోరారు. ఇప్పటివరకూ మందులేని కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే అసలైన మందని మోదీ గురువారం రాత్రి జాతిని ఉద్దేశిస్తూ అన్నారు. అందుకు నాందిగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని కోరారు.
‘ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ప్రతి భారతీయుడు ఇంటిలోనే ఉండాలని, బయటికి రాకూడదని కోరుతున్నా. ఐకమత్యంగా కరోనా వైరస్పై పోరాడుదాం’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. ‘కొవిడ్-19ని జయించాలంటే మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే ‘జనతా కర్ఫ్యూ’ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
‘వీలైనంత వరకు ఇంటిలో ఉందాం. జాగ్రత్తలు తీసుకుందాం. ప్రస్తుతానికి మనకున్న ఒకే ఒక్క పరిష్కారం ఇది. తగిన ముందు జాగ్రత్త చర్యలతో ఒకరినొకరం కాపాడుకుందాం. రేపు జరగబోయే ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొనడం మర్చిపోకండి. ఈ వైరస్తో పోరాడుతున్న మన సైనికులను ప్రశంసిద్దాం’ అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.
ఒకప్పుడు శుభ్రత అవసరమని, ఇప్పుడు బాధ్యతని దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వీడియో షేర్ చేశారు. ‘కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. భారతీయ జీవన విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శం. మన ఆహారపు అలవాట్లు, మన ఆరోగ్య సూత్రాలు మన పెద్దలు మనకిచ్చిన ఆస్తులు. క్రమశిక్షణతో వాటిని పాటిస్తే.. దేన్నైనా ఢీకొట్టగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకానొక సమయంలో శుభ్రత అనేది అవసరం.. ఇప్పుడు బాధ్యత. మోదీ గారికి మద్దతుగా ఉందాం.. ఆయన సూచనల్ని పాటిద్దాం’ అని బోయపాటి చెప్పారు.
‘ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనమంతా మన నివాసాల్లో ఉందాం. ఈ కష్ట సమయంలో ఐకమత్యంగా పోరాడుదాం. నేను జనతా కర్ఫ్యూని పాటిస్తున్నా.. మీరు కూడా పాటిస్తారని ఆశిస్తున్నా’ అని వెంకటేష్ అభిమానులకు పిలుపునిచ్చారు.
‘రేపు మనమంతా ఇంట్లో ఉందాం. ఏ ఇంట్లో, ఎవరికీ, ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడదాం. మన ఇల్లు, మన దేశం, మన బాధ్యత.. జనతా కర్ఫ్యూ’ అని అనిల్రావిపూడి ట్వీట్ చేశారు.
‘కరోనా వైరస్ ఎంతో ప్రమాదకరం. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అందరూ ఎవరి ఇంటిలో వారు ఉండటానికి ప్రయత్నించండి. మన ప్రధాని జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతు తెలుపుదాం. మన కోసం వైద్యులు ఎంతో కష్టపడుతున్నారు. వారి కోసం చప్పట్లు కొడదాం’ అంటూ మంచు మనోజ్ వీడియోను షేర్ చేశారు. అంతేకాదు మాలీవుడ్ హీరో మోహన్లాల్, కోలీవుడ్ హీరో ధనుష్ కూడా జనతా కర్ఫ్యూకి మద్దతిచ్చారు. ఆదివారం ఇళ్లల్లో ఉండాలని అభిమానుల్ని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె