రెండేళ్ల ముందే ‘వైరస్‌’ గురించి చెప్పా: వర్మ

‘వైరస్‌’ అనే టైటిల్‌తో సినిమా తీయబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ‘సర్కార్‌’, ‘ది ఎటాక్‌’ చిత్రాల నిర్మాత పరాగ్‌ సంఘ్వీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వర్మ 10/6/2018లో ట్వీట్‌ చేశారు. పూర్తి ప్రకటన కోసం ఫేస్‌బుక్‌.....

Published : 03 Apr 2020 20:14 IST

మీరే చూడండి..

హైదరాబాద్‌: ‘వైరస్‌’ అనే టైటిల్‌తో సినిమా తీయబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ‘సర్కార్‌’, ‘ది ఎటాక్‌’ చిత్రాల నిర్మాత పరాగ్‌ సంఘ్వీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వర్మ 10/6/2018లో ట్వీట్‌ చేశారు. పూర్తి ప్రకటన కోసం ఫేస్‌బుక్‌ లింక్‌ను కూడా షేర్‌ చేశారు. ఎబోలా కంటే భయంకరమైన వైరస్‌ ముంబయి నగరాన్ని వణికించే కథాంశంతో సినిమా తీయబోతున్నట్లు ఆయన ప్రకటనలో చెప్పారు.

‘ఆఫ్రికా పర్యటనకు వెళ్లి ముంబయి వచ్చిన ఓ యువకుడి ద్వారా వైరస్‌ అందరికీ సోకుతుంది. ఊహించని ఈ పరిణామంతో ప్రభుత్వం కోట్లాది ప్రజలున్న ముంబయిలో ఒకరి నుంచి మరొకరు 20 అడుగుల దూరం ఉండాలని సూచిస్తుంది. ఆపై వైరస్‌ విపరీతంగా వ్యాపించి, లక్ష మందికిపైగా మృతి చెందుతారు.  ఈ నగరం నుంచి రాకపోకల్ని నిషేధిస్తారు.  భయబ్రాంతులకు గురైన ముంబయి వాసులు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఎవరు ఈ వైరస్‌ను వ్యాప్తి చేస్తారో అన్న భయంతో.. పారిపోయే వారిని కాల్చి చంపేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ కథకు భయం, ప్రేమ, ఉత్కంఠ, త్యాగం, ఆశల్ని మేళవించి హ్యూమన్‌ డ్రామాగా సినిమా రూపొందించబోతున్నాం’ అని వర్మ రెండేళ్ల క్రితం వెల్లడించారు.

ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న తరుణంలో ఆ విషయాన్ని వర్మ గుర్తు చేసుకున్నారు. ‘మహమ్మారి వైరస్‌పై స్క్రిప్టు రాశానని, సినిమా తీస్తానని 10/6/2018లో చెప్పా. ఇవాళ జరుగుతున్న పరిణామాలకు నా కథ ఎంత దగ్గరగా ఉందో చూడండి. రెండేళ్ల క్రితం నేను చేసిన ట్వీట్‌ ఇది’ అని ఆయన శుక్రవారం పోస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని