మా వంతుగా చిన్న సాయం చేస్తున్నాం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిలో తమ వంతు సాయం చేస్తున్నామని టాలీవుడ్ అగ్రకథనాయకుడు చిరంజీవి అన్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరాలు అందించిన ఓ పాటను చిరంజీవి, నాగార్జున, సాయిధరమ్ తేజ్...
మోదీ ప్రశంసపై చిరు స్పందన
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిలో తమ వంతు సాయం చేస్తున్నామని టాలీవుడ్ అగ్రకథనాయకుడు చిరంజీవి అన్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరాలు అందించిన ఓ పాటలో చిరంజీవి, నాగార్జున, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ నటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ వీడియో చూసిన మోదీ టాలీవుడ్ హీరోలను పేరు పేరునా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి తన ట్విటర్ ఖాతా వేదికగా మోదీ ప్రశంసపై స్పందించారు. ‘మీ ప్రశంసకు ధన్యవాదాలు మోదీ గారు. మనదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి మహాకార్యంలో మేము మా వంతుగా చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటి, మా అందరి తరఫున మీకు నా ధన్యవాదాలు’ అని చిరు ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చిరంజీవి పలు వీడియోలను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల చిరంజీవి, నాగార్జున, యువ కథానాయకులు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కలిసి కరోనాపై అవగాహన కల్పించే విధంగా రూపొందించిన ‘వి గోనా ఫైట్ కరోనా ఏదేమైనా... చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా’ అంటూ సాగే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది . ఈ పాటను విన్న ప్రధాని నరేంద్రమోదీ ఆయా హీరోలను ప్రశంసించారు. ‘చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి ధన్యవాదాలు. అందరం మన ఇళ్లలోనే ఉందాం. సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.’ అని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్చరణ్ బర్త్డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పుడు బెంగళూరులో.. రేపు ఎక్కడైనా: నీటి విలువపై చిరంజీవి పోస్ట్
బెంగళూరు నీటి సమస్యపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. -
Naga Vamsi: పెద్ద హీరోల సినిమాల్లో లాజిక్లు చూడొద్దు: నాగవంశీ
సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలని నిర్మాత నాగవంశీ అన్నారు. ‘గుంటూరు కారం’ నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యాక దాన్ని చాలా మంది మెచ్చుకొన్నారని తెలిపారు. -
Tillu Square: తెరపై హాట్గా కనిపించడం చాలా కష్టం: అనుపమ పరమేశ్వరన్
స్క్రీన్పై హాట్గా కనిపించడం చాలా కష్టమని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ‘టిల్లు స్క్వేర్’ ప్రమోషన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. -
Vijay Deverakonda: ఇప్పటికీ సర్దుకుపోతుంటా: విజయ్ దేవరకొండ
తన కొత్త సినిమా ‘ఫ్యామిలీస్టార్’ ప్రచారంలో భాగంగా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆ విశేషాలివీ.. -
Social Look: హోలీ స్పెషల్.. రష్మిక వర్కింగ్.. ఫ్యామిలీతో కియారా.. పాయల్, కాజల్ ఇలా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Shruti Haasan: ప్రేమించడం ఒక భ్రమని నమ్ముతున్నా: శృతిహాసన్
హీరోయిన్ శృతిహాసన్ తాను నటించిన ‘ఇనిమేల్’ పాట గురించి తెలిపారు. -
Triptii Dimri: అలా కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం కావాలి: త్రిప్తి డిమ్రి
నటి ప్రియాంక చోప్రా అంటే తనకెంతో ఇష్టమని త్రిప్తి డిమ్రి మరోసారి వెల్లడించారు. -
siddhu jonnalagadda: మంచి కథలు నా వద్దకు వచ్చేవి కాదు: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. -
Vijay Devarakonda: హోలీ సంబరాల్లో ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్.. డ్యాన్స్తో అలరించిన మృణాల్
‘ఫ్యామిలీ స్టార్’గా పలకరించేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యారు. -
Taapsee: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. చక్కర్లు కొడుతున్న వార్తలు!
నటి తాప్సీ పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
RRR: ట్రెండింగ్లో ‘ఆర్ఆర్ఆర్’.. కారణమేమిటంటే!
‘ఆర్ఆర్ఆర్’ విడుదలై నేటికి రెండేళ్లు పూర్తయింది. -
Social Look: పందితో ఆది- నిక్కీ పోజులు.. కృతి హల్దీ వేడుక ఫొటోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన