రాజనే భయం లేదు.. పేదనే జాలి లేదు..!

కరోనాకు రాజు అనే భయం లేదు.. పేద అనే జాలి లేదు అని చెబుతున్నారు నటి మాధవీ లతా. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను ఉద్దేశించి ఆమె టిక్‌టాక్‌ వీడియో చేశారు. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. జాగ్రత్తగా ఉండమని....

Updated : 07 Apr 2020 13:38 IST

కరోనాపై మాధవీ లత టిక్‌టాక్‌ వీడియో వైరల్ 

హైదరాబాద్‌: కరోనాకు రాజు, పేద తేడా తెలియదు అని అంటున్నారు నటి మాధవీ లత. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను ఉద్దేశించి ఆమె టిక్‌టాక్‌ వీడియో చేశారు. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

‘మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను 4.4 లక్షల మందికిపైగా వీక్షించారు. 35 వేల మంది లైక్‌ చేశారు. ‘ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏంటో తెలియజేశారు, చాలా బాగా చెప్పారు, మీ కవిత చాలా బాగుంది..’ అని పలువురు కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని