సినిమాలకు విక్రమ్‌ వీడ్కోలు.. స్పందించిన పీఆర్వో..!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్రమ్‌ త్వరలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్‌ తీసుకోనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన పీఆర్వో స్పందించారు. విక్రమ్‌ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ‘కోబ్రా’ సినిమాలో నటిస్తున్న విక్రమ్‌ త్వరలో...

Published : 10 Apr 2020 16:18 IST

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్రమ్‌ త్వరలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్‌ తీసుకోనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన పీఆర్వో స్పందించారు. విక్రమ్‌ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘కోబ్రా’ సినిమాలో నటిస్తున్న విక్రమ్‌ త్వరలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్‌ తీసుకుని తన కుమారుడు ధ్రువ్‌ కెరీర్‌పై దృష్టి సారించనున్నట్లు ఇటీవల ఓ స్థానిక పత్రికలో వార్త ప్రచూరితమైంది. దీంతో విక్రమ్‌ అభిమానులు ఆశ్చర్యానికి, నిరాశకులోనయ్యారు. విక్రమ్‌ సినిమాల్లో కొనసాగాలంటూ నెట్టింట్లో ట్వీట్ల వర్షం కురిపించారు. 

ఈ నేపథ్యంలో తాజాగా విక్రమ్‌ పీఆర్వో ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు. అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కోబ్రా’ సినిమాలో ప్రస్తుతం విక్రమ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో నటించనున్నారు. తదుపరి 7 స్ర్కీన్‌స్టూడియో నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేయనున్నారు. విక్రమ్‌ చిత్రాలకు సంబంధించిన మరెన్నో ఆసక్తికర విషయాలు త్వరలో విడుదల కానున్నాయి.’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని