అతను మాట మీద నిలబడిన వ్యక్తి: బన్నీ

సంగీత దర్శకుడు తమన్‌ మాట మీద నిలబడ్డ వ్యక్తి అని టాలీవుడ్‌ కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. బన్నీ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. ప్రస్తుతం ఈ సినిమా ఆల్బమ్‌ 1.13 బిలియన్‌ వ్యూస్‌తో...

Updated : 11 Apr 2020 13:20 IST

జీవితాంతం ట్వీట్‌ దాచుకుంటా

హైదరాబాద్‌: సంగీత దర్శకుడు తమన్‌ మాట మీద నిలబడ్డ వ్యక్తి అని టాలీవుడ్‌ కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. బన్నీ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. ప్రస్తుతం ఈ సినిమా ఆల్బమ్‌ 1.13 బిలియన్‌ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ను ప్రశంసిస్తూ బన్నీ తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘మై డియర్‌ తమన్‌. నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ‘అల..వైకుంఠపురములో..’ సినిమా ప్రారంభం కావడానికి కంటే ముందు.. బిలియన్‌ వ్యూస్‌ ఉండేలా నాకు ఆల్బమ్‌ కావాలని నీతో చెప్పాను. దానికి నువ్వు.. ‘సరే బ్రదర్‌. నేను ప్రామిస్ చేస్తున్నా’ అని అన్నావు. ఈరోజు 1.13 బిలియన్‌ మంది ‘అల..వైకుంఠపురములో..’ ఆల్బమ్‌ను చూశారు. ధన్యవాదాలు. మాట మీద నిలబడే వ్యక్తి’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. 

ఇదిలా ఉండగా బన్నీ పెట్టిన ట్వీట్‌పై తమన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘జీవితాంతం ఈ ట్వీట్‌ను దాచిపెట్టుకుంటాను’ అని రిప్లై ఇచ్చారు. ‘బ్రదర్‌ చాలా పెద్ద మాటలు. ఆ ఆల్బమ్‌ అంత హిట్‌ అయ్యిందంటే కారణం నువ్వు, మన ప్రియమైన దర్శకుడు త్రివిక్రమ్‌. ‘అల.. వైకుంఠపురములో..’ ప్రయాణం నా హృదయానికి ఎంతో చేరువైంది. మీరిద్దరూ నామీద చూపించిన ప్రేమ, నమ్మకం వల్లే అది సాధ్యమైంది. మీరు చూపించిన ప్రేమాభిమానాలే ఈ సినిమాకి నేను 100 శాతం మంచి సంగీతం ఇచ్చేలా చేశాయి.’అని తమన్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని