ఆమె ఆపరేషన్‌ విజయవంతం.. చిరు ఆనందం!

అగ్ర కథానాయకుడు చిరంజీవి సాయంతో రాజనాల నాగలక్ష్మి అనే మహిళకు ఆపరేషన్‌ చేశారు. శనివారం నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఆమె ఆరోగ్యం బాగుందని, చిరు ఎప్పటికప్పుడు ఫోన్‌ చేసి పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు చెప్పారు......

Published : 11 Apr 2020 19:25 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి సాయంతో రాజనాల నాగలక్ష్మి అనే మహిళకు ఆపరేషన్‌ చేశారు. శనివారం నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఆమె ఆరోగ్యం బాగుందని, చిరు ఎప్పటికప్పుడు ఫోన్‌ చేసి పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు చెప్పారు. చికిత్స పూర్తి కాగానే మొదటి ఫోన్‌ చిరంజీవికి చేశామని, ఆయన చాలా సంతోషించారని అన్నారు.

ఈ సంద‌ర్భంగా చిరు మాట్లాడుతూ.. ‘వైద్యడు గోపీచంద్‌కి, ఆయన బృందానికి ధన్యవాదాలు. అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కు రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్‌కి, ఇంతదూరం ప్రయాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని అన్నారు.

గుంటూరు జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ’ అధ్యక్షురాలు రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి మెడికల్‌ రిపోర్ట్స్‌ తెప్పించుకుని.. హైదరాబాద్‌లో వైద్యుడు గోపీచంద్ ద్వారా జబ్బు తీవ్రతను గుర్తించారు. వెంటనే హుటాహుటిగా ఆమెను హైదరాబాద్‌కి రప్పించే ఏర్పాట్లు చేసి, ఆపరేషన్‌కి సంబంధించి అన్ని సదుపాయాలు చూసుకుంటున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని