వెయ్యి మందికి రజనీ సాయం..
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టిస్టులకు సూపర్స్టార్ రజనీకాంత్ తనవంతు సాయం ప్రకటించారు. రోజురోజూకీ విజృంభిస్తోన్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు గత కొన్నిరోజుల నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే....
నిత్యావసరాలు అందించనున్న సూపర్స్టార్
చెన్నై: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టిస్టులకు సూపర్స్టార్ రజనీకాంత్ తనవంతు సాయం ప్రకటించారు. రోజురోజూకీ విజృంభిస్తోన్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు గత కొన్నిరోజుల నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా గత నెల నుంచి షూటింగ్స్ నిలిచిపోవడంతో ఎంతోమంది ఆర్టిస్ట్లు కుటుంబపోషణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఇండస్ట్రీలో పనిచేస్తున్న రోజువారీ కార్మికులతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర ఆర్టిస్ట్లకు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫేడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు రూ.50 లక్షలను విరాళంగా అందించిన సూపర్స్టార్ తాజాగా వెయ్యి మంది ఆర్టిస్ట్లకు సాయం చేయనున్నారు. ఈ మేరకు రజనీ నడిగర్ సంఘంలో సభ్యులుగా ఉన్న 1000 మంది ఆర్టిస్ట్లకు నిత్యావసరాలను అందించనున్నారు.
మరో 25 వేల మందికి సోను భోజనం
లాక్డౌన్ కారణంగా సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న ముంబయిలోని పేదవారికి నటుడు సోనుసూద్ గతకొన్నిరోజులుగా ఆహారం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ‘శక్తి అన్నదానం’ పేరిట ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ 45000 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. తాజాగా ఆయన మరో 25000 మందికి ఆహారాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బంగా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు రాజస్థాన్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారికి ఆహారం కూడా సరిగ్గా అందడం లేదనే విషయాన్ని తెలుసుకున్న సోనుసూద్ అక్కడి అధికారులతో మాట్లాడి.. కార్మికుల కోసం ప్రత్యేకంగా వంటగదులను ఏర్పాటు చేయించి మంచి భోజనాన్ని అందించనున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘రంజాన్ మాసం సందర్భంగా వారికి ఎలాంటి ఆహారం అవసరమైతే అలాంటి ఆహారాన్ని అందిస్తానని వాళ్లకి మాటిచ్చాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వేరొకరికి సాయం చేయడం ఎంతో అవసరం. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉంటున్న వారందరికీ ప్రత్యేకమైన ఆహారాన్ని అందించనున్నాం.’ అని సోను పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది..
తాజా వార్తలు (Latest News)
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
అశుతోష్ అదరగొట్టినా.. ముంబయిదే విజయం
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య