అలాంటి కష్టాలు ఎదుర్కొనలేదు: అనసూయ

కెరీర్‌ ఆరంభంలో తాను కష్టాలను ఎదుర్కొనలేదని బుల్లితెర యాంకర్‌ అనుసూయ భరద్వాజ్‌ అన్నారు. తన అందం, అభినయంతో బుల్లితెర, వెండితెరపై రాణించి ఎందరో అభిమానులను ఆమె సొంతం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా...

Published : 23 Apr 2020 18:57 IST

ఆ డబ్బుతో అమ్మకు ఉంగరం కొన్నా

హైదరాబాద్‌: కెరీర్‌ ఆరంభంలో తాను కష్టాలను ఎదుర్కొనలేదని బుల్లితెర యాంకర్‌ అనుసూయ భరద్వాజ్‌ అన్నారు. తన అందం, అభినయంతో బుల్లితెర, వెండితెరపై రాణించి ఎందరో అభిమానులను ఆమె సొంతం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా, బుల్లితెర షూటింగ్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన ఆమె సమయం కుదిరినప్పుడు నెటిజన్లతో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆమె అభిమానులతో ట్విటర్‌ వేదికగా ముచ్చటించి.. వాళ్లు  అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

askAnasuya పేరుతో నిర్వహించిన ఈ ట్విటర్‌ ఛాటింగ్‌లో భాగంగా ఓ నెటిజన్‌.. ‘టీవీ యాంకరింగ్‌ రంగంలోకి అడుగుపెట్టే సమయంలో మీరు ఏమైనా కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్నారా? యాంకర్‌ కావడానికంటే ముందు మీరు ఎదుర్కొన్న అతి క్లిష్టమైన సమస్య ఏమిటి?’ అని అడిగాడు. నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.. ‘మీరు ఏమైతే ఊహించుకుంటున్నారో అలాంటి కష్టాలు నేను ఎదుర్కొనలేదు. ఎందుకంటే నాకు అలాంటివి నచ్చవు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతిరోజూ వర్క్‌లో నా నుంచి కొత్తదనం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాను’ అని అనసూయ తెలిపారు. అనంతరం మరో నెటిజన్‌.. ‘మొదటి జీతాన్ని ఏం చేశారు?’ అని ప్రశ్నించగా.. ‘మా అమ్మకు బంగారపు ఉంగరాన్ని కొన్నాను’ అని సమాధానం తెలిపారు. ‘ఇప్పుడు మీరు ఏమైనా సినిమాల్లో నటిస్తున్నారా?’ అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘మూడు సినిమాలు జరుగుతున్నాయి. ఇంతలోనే లాక్‌డౌన్‌ వచ్చింది. ఈ లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఎవరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో నాకూ తెలియదు.’ అని అనసూయ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని