అప్పుడు మాత్రమే థియేటర్కు వస్తారు: సురేష్ బాబు
చిత్ర పరిశ్రమ విధానాలు మారితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ నిర్మాత సురేష్బాబు అన్నారు. లాక్డౌన్ ప్రభావం చిత్ర పరిశ్రమపై తీవ్రంగా పడిన సంగత తెలిసిందే. రూ. కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన సినిమాల విడుదల ఆపుకోవాల్సి వచ్చింది. షూటింగ్లో ఆగిపోయాయి. మరోపక్క సినీ.....
అప్పటి వరకూ కష్టమే..!
చిత్ర పరిశ్రమ మారితేనే మంచి భవిష్యత్తు
హైదరాబాద్: చిత్ర పరిశ్రమ విధానాలు మారితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ నిర్మాత సురేష్బాబు అన్నారు. లాక్డౌన్ ప్రభావం చిత్ర పరిశ్రమపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. రూ.కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన సినిమాల విడుదల ఆపుకోవాల్సి వచ్చింది. షూటింగ్లు ఆగిపోయాయి. మరోపక్క సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో సురేష్బాబు మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత చిత్ర పరిశ్రమను నెమ్మదిగా మొదలుపెడతాం. ఎందుకంటే భౌతిక దూరంతో షూటింగ్ జరపడం సాధ్యం కాదు. థియేటర్లో కూడా సామాజిక దూరం పాటించి.. సినిమాలు చూస్తే మంచి అనుభూతిని ఇవ్వలేకపోవచ్చు. మెల్లగా మార్పులు జరుగుతాయి. ఎలా తిరిగి షూటింగ్ చేయాలి? ఎలా జనాల్ని థియేటర్కు రప్పించాలి? అనే విషయాలు ఆలోచించాలి. 20-30 మందితో కలిసి చిన్న, మీడియం సినిమాల షూటింగ్ చేయడం మొదలుపెడతాం. ఇన్డోర్, అవుట్డోర్లో పరిమిత వ్యక్తులతో చిన్న సినిమాలు తీస్తాం. వీలుంటే ముందుగా వాటిని ఓటీటీ ఫ్లాట్ఫాంలో విడుదల చేస్తాం’’
‘‘లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా పంపిణీదారులపై పడింది. డిజిటల్ పరంగా మేం ఏం చేయగలమో అన్నీ చేస్తాం. ఎవరైనా సరే మార్పుల్ని అంగీకరించాలి. చిత్ర పరిశ్రమ మారితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇన్నాళ్లూ ఓ విధంగా బతికాం.. ఇప్పుడు మారాల్సి పరిస్థితి వచ్చింది. నాకు మరో సంవత్సరం వరకు పెద్దగా పనులు లేవు. ఈ సమయంలో నన్ను నేను భవిష్యత్తు కోసం రెడీ చేసుకుంటున్నా. ఇంట్లో ఉండీ ఉండీ అందరికీ విసుగొచ్చేసింది. కరోనా ఇకలేదు.. అని రేపు ప్రకటించినా అందరూ థియేటర్లు, మాల్స్, పబ్లకు గుంపులు గుంపులుగా వెళ్లిపోతారు. వర్క్ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వస్తే థియేటర్లకు ఇంకా డిమాండ్ పెరుగుతుంది. భయం వెళ్లిపోయిన తర్వాత మాత్రమే అందరూ థియేటర్లకు వస్తారు. అప్పటి వరకు ఇలానే ఉంటుంది. ఈ సీజన్లో అమెజాన్, నెట్ఫ్లిక్స్ డిమాండ్ బాగా పెరిగింది. కొందరు తమ సినిమాల్ని వీటిలో విడుదల చేయొచ్చు. మరికొందరు థియేటర్లు ప్రారంభం అయ్యే వరకూ ఎదురుచూడొచ్చు. ఇప్పటికే తమిళంలో జ్యోతిక సినిమా విడుదలకు సిద్ధమైంది. దానిపై వివాదం జరుగుతోంది. హిందీలోనూ సినిమాలు విడుదల అవుతున్నాయి. విజయ్ సినిమాకు రూ.150 కోట్లు ఖర్చు అయ్యిందట. అదే బడ్జెట్ ఓటీటీ ఫ్లాట్ఫాం ఇస్తే.. వారికి ఇవ్వడానికి దర్శక, నిర్మాతలు సిద్ధంగానే ఉంటారేమో. అది సినిమా తీసే వారి ఇష్టం’’
‘హోమ్ క్వారంటైన్లో వ్యాయామం చేస్తున్నా. కుటుంబ సభ్యులతో ముచ్చట్లు చెప్పుకొంటూ కొత్త పనులు నేర్చుకుంటున్నా. రానా, అభితో ఏదో చెబుతుంటారు వింటుంటా. వాళ్లతోనే ఎక్కువ సమయం గడిచిపోతోంది. స్నేహితుల గ్రూపుల్లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ‘నష్టపోతున్నాం, మళ్లీ ఎప్పుడు కోలుకోవాలి’ అంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి రోజుల్ని కథల్లో ఊహించాం కానీ.. నిజంగా వస్తాయి అనుకోలేదు. కరోనా తర్వాత మనం కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం. దానికి సిద్ధంగా ఉండాలి. నేనైతే పాజిటివ్గా ఉన్నా. నా రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఒత్తిడి పెట్టుకుని సాధించేది ఏమీ లేదు. మా వీధిలో ఎవరైనా నడుస్తున్నా.. తిడుతున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు సురేశ్బాబు.
ఇదీ చదవండి..
సూర్య చిత్రాలపై నిషేధం:థియేటర్ యజమానులు
పేద డ్యాన్సర్లకు లారెన్స్ సాయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ హీరోతో నా తొలి సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది: కృతి సనన్
తన మొదటి సినిమా సల్మాన్తో నటించాలని కలలు కన్నట్లు కృతి సనన్ చెప్పారు. -
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్