ఆ ఘనత విజయ్‌ దేవరకొండకే దక్కింది!

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన మైలురాయి చేరుకున్నారు. 7 మిలియన్ల ఫాలోవర్స్‌తో దక్షిణాదిలో అత్యధిక అనుచరులున్న కథానాయకుడిగా నిలిచారు. హీరోగా నిలదొక్కుకున్న అతి తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించడం విశేషం. విజయ్‌ 2018....

Updated : 05 May 2020 19:55 IST

హైదరాబాద్‌: యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన మైలురాయి చేరుకున్నారు. 7 మిలియన్ల ఫాలోవర్స్‌తో దక్షిణాదిలో అత్యధిక అనుచరులున్న కథానాయకుడిగా నిలిచారు. హీరోగా నిలదొక్కుకున్న అతి తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించడం విశేషం. విజయ్‌ 2018 మార్చి 7న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఆరంభించారు. ఇప్పటి వరకు 163 పోస్ట్‌లు చేశారు. ఆయన ఒక్కర్ని కూడా అనుసరించడం లేదు. తన సోషల్‌మీడియా ఖాతాలను నడపడానికి ప్రత్యేక బృందం ఉందని, ముఖ్యమైన వాటిని వాళ్లు తన దృష్టికి తీసుకొస్తుంటారని ఇటీవల విజయ్ చెప్పారు.

‘అర్జున్‌ రెడ్డి’ సినిమా విజయ్‌ కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చింది. ఆపై ‘గీత గోవిందం’, ‘మహానటి’, ‘టాక్సీవాలా’ తదితర సినిమాలతో అలరించారు. అంతేకాదు నిర్మాతగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీలోనూ రూపొందిస్తున్నారు. అనన్యా పాండే కథానాయిక. పూరీ, ఛార్మితోపాటు కరణ్‌ జోహార్‌ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్రం ముంబయి షెడ్యూల్‌ పూర్తయింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని