అలా చూడు తులిప్ లోకం పిలుస్తోన్నది..
చుట్టూ అందమైన కొండలు.. ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు.. కనుచూపుమేర రంగురంగుల తులిప్ అందాలు.. ఊహిస్తుంటే ఎంత అద్భుంతగా ఉందో కదా.. ప్రస్తుతం ఆసియాలోని అతి పెద్ద తులిప్ ఉద్యానవనం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్లోని.....
వెండితెరపై భూతల స్వర్గం
చుట్టూ అందమైన పర్వతాలు.. ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు.. కనుచూపుమేర రంగురంగుల తులిప్ అందాలు.. ఊహిస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో కదా.. ప్రస్తుతం ఆసియాలోని అతి పెద్ద తులిప్ ఉద్యానవనం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్లోని ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ రంగురంగుల పువ్వులతో కలకలలాడుతోంది. దాదాపు 13 లక్షల తులిప్ పువ్వులు విరబూశాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఈ ఉద్యానవనాన్ని చూడటానికి సందర్శకులు రావడం లేదు.
తులిప్ అందాలను ఇప్పటికే అనేక చిత్రాల్లో వెండితెరపై ఆవిష్కరించారు. ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లి షూట్ చేసిన గీతాలు కూడా ఉన్నాయి. పలు డ్యూయెట్లలో ఈ పూలు కనువిందు చేశాయి. అలా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్న కొన్ని గీతాల్ని ఓసారి చూద్దాం..
‘కొత్త కొత్తగా ఉన్నది.. స్వర్గమిక్కడే అన్నది..’ అనే పల్లవికి సరైన అర్థం చూపించాలి అనుకున్నారేమో దర్శక, నిర్మాతలు. అందుకే మనసును పులకరింపజేసే తులిప్ అందాల మధ్య టబు, వెంకటేష్లను పెట్టి పాటను చిత్రీకరించారు. వీరిద్దరు జంటగా నటించిన సినిమా ‘కూలీ నెం.1’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రంలోని ఈ గీతం హైలైట్గా నిలిచింది.
కోలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ విక్రమ్. ఆయన్ను తెలుగు వారికి దగ్గర చేసిన సినిమా ‘అపరిచితుడు’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సదా కథానాయికగా నటించారు. విక్రమ్ మూడు విభిన్నమైన పాత్రల్లో మెప్పించారు. సదా ప్రేమ కోసం పరితపిస్తూ.. ‘కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి బక్క సిక్కెనె..’ అని సాగే గీతాన్ని తులిప్ పువ్వుల మధ్య చిత్రీకరించారు.
‘అలా చూడు ప్రేమ లోకం.. పిలుస్తోన్నది..’ అంటూ వెంకటేష్, అంజలా జవేరీ పూల సోయగాల మధ్య డ్యుయెట్ వేసుకుంటారు. ‘ప్రేమించుకుందాం రా..’ సినిమాలోని గీతమిది. సి. జయంత్ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ గీతం హిట్ అందుకుంది.
‘మృగరాజు’ చిరంజీవి, సిమ్రాన్ల వివాహం జరుగుతుంది. ఇద్దరూ కలిసి నూతన జీవితాన్ని ఆరంభిస్తారు. ఆ సమయంలో ‘శతమానమన్నదిలే.. చెలిమే.. చిన్న చిన్నారి ఆశలు గిల్లి..’ అంటూ పాట తెరపైకి వస్తుంది. ఈ గీతం అందర్నీ ఆకట్టుకుంది. ఇందులోని రంగురంగుల తులిప్లను చూపిస్తారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దేవివర ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ బాణీలు సమకూర్చారు.
బాలకృష్ణ, కత్రినా కైఫ్ ఆడిపాడిన గీతం ‘నేడే ఈనాడే..’. ఇందులో తులిప్ పువ్వులు కనువిందు చేస్తాయి. ‘అల్లరి పిడుగు’ సినిమాలోని గీతమిది. ఛార్మి మరో కథానాయిక. ఎమ్.ఆర్.వి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ బాణీలు అందించారు. ఈ సినిమాకు సి. జయంత్ దర్శకత్వం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!