15 ఏళ్లకే నటిగా మారి.. నిర్మాతగా రాణిస్తూ..!
నటి, కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం నిర్మాతగా పలు విభిన్న కథా చిత్రాలను సినీ ప్రియులకు అందిస్తున్నారు ఛార్మి. ఆదివారం ఛార్మి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు...
ఛార్మింగ్ గర్ల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
హైదరాబాద్: నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం నిర్మాతగా పలు విభిన్న కథా చిత్రాలను సినీ ప్రియులకు అందిస్తున్నారు ఛార్మి. ఆదివారం ఛార్మి పుట్టిన రోజు పురస్కరించుకుని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 15 ఏళ్లకే వెండితెరపైకి అడుగుపెట్టిన ఛార్మి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలను ఆమె నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
15 ఏళ్లకే భార్య పాత్రలో..
2002లో విడుదలైన ‘నీ తోడు కావాలి’ చిత్రంతో ఛార్మి కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛార్మి.. భార్య పాత్రలో కనిపించారు. నటనపరంగా తొలి చిత్రంతోనే ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. దీంతో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. అలా దక్షిణాది భాషలతోపాటు హిందీ చిత్రాల్లో కూడా ఛార్మి నటించారు.
‘మంత్ర’ చిత్రానికి నంది వరించి..
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రకథానాయకుల చిత్రాలతోపాటు యువ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, సుమంత్, నితిన్ సరసన కూడా ఛార్మి నటించారు. ‘మాస్’, ‘చక్రం’, ‘లక్ష్మి’, ‘రాఖీ’, ‘పౌర్ణమి’ చిత్రాలతోపాటు ‘అనుకోకుండా ఒకరోజు’, ‘మంత్ర’, ‘మంగళ’ లాంటి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి మెప్పించారు. సుమారు 50 సినిమాల్లో నటించిన ఛార్మి 2007లో విడుదలైన ‘మంత్ర’ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. 2012లో విడుదలైన ‘మంగళ’ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వరించింది.
ఆరు భాషల్లో..
పంజాబీ కుటుంబానికి చెందిన ఛార్మికి మాతృభాషతోపాటు మరో ఐదు భాషలు తెలుసు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠి, తమిళం భాషల్లో ఆమె మాట్లాడగలరు.
మావో..
ఛార్మి అందరితో కలివిడిగా ఉంటారనే విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోనే కాకుండా మిగిలిన రంగాల్లో కూడా ఆమెకు స్నేహితులు ఎక్కువ. అందువల్లే ఛార్మికి బాగా కావాల్సిన వారు ఆమెను ‘మావో’ అని పిలుస్తారు. అదే ఆమె ముద్దు పేరు.
మూగజీవులపై మక్కువ..
ఛార్మికి మూగజీవులంటే ఎంతో ఇష్టం. శునకాలతోపాటు పలు పక్షులనూ పెంచుకుంటున్నారు. వాటితో సరదాగా గడిపిన ఫొటోలను సైతం సోషల్మీడియా వేదికగా ఆమె షేర్ చేస్తుంటారు.
నిర్మాతగా..
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో ఛార్మి నిర్మాతగా మారారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో ఛార్మి టైటిల్ రోల్ పోషించారు. బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పైసా వసూల్’ చిత్రానికి కూడా ఆమె నిర్మాతగా పనిచేశారు. గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో నిర్మాతగా మాస్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కాగా, పుట్టినరోజు పురస్కరించుకుని పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా ఛార్మిని విష్ చేశారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఈ ఏడాది పుట్టినరోజును కుటుంబసభ్యులతోనే జరుపుకొన్నారు. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను పూరీ కనెక్ట్స్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది..
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’