ఆ 11 నెలల చిన్నారే.. ఇప్పుడు రాక్స్టార్ హీరో..!
11 నెలలకే వెండితెరపై సందడి చేసి.. బాలనటుడిగా మెప్పించిన హీరో మంచు మనోజ్. డైలాగ్ కింగ్ మోహన్బాబు రెండో కుమారుడిగా వెండితెరకు పరిచయమై హీరోగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు...
చైల్డ్ ఆర్టిస్ట్ టు ప్రొడ్యూసర్.. మంచు మనోజ్ లైఫ్ స్టైల్
ఇంటర్నెట్డెస్క్: 11 నెలలకే వెండితెరపై సందడి చేసి.. బాలనటుడిగా మెప్పించిన హీరో మంచు మనోజ్. డైలాగ్ కింగ్ మోహన్బాబు రెండో కుమారుడిగా వెండితెరకు పరిచయమై హీరోగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమానే ప్రపంచంగా బతికే ఆయనలో కేవలం నటుడు మాత్రమే కాకుండా పాటల రచయిత కూడా ఉన్నాడు. ఇటీవల నిర్మాతగా మారి ఎంఎంఆర్ట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించి.. నూతన టాలెంట్కు ఆహ్వానం పలుకుతున్నాడు. బుధవారం మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..
11 నెలలకే వెండితెరపై మెరిసి..
నందమూరి తారకరామారావు కథానాయకుడిగా మోహన్బాబు ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. 1993లో విడుదలైన ఈ సినిమాతోనే మనోజ్ బాలనటుడిగా వెండితెరపై సందడి చేశారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అంతకుముందే ఆయన ఓ సినిమాలో కనిపించాడు. మోహన్బాబు హీరోగా జయసుధ, రాధిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గృహలక్ష్మి’. 1984లో విడుదలైన ఈ సినిమాలో మనోజ్ చిన్నపిల్లాడిగా కనిపించాడు. అప్పుడు మనోజ్ వయసు 11 నెలలు. ‘మేజర్ చంద్రకాంత్’ తర్వాత ‘పుణ్యభూమి నాదేశం’ చిత్రంతోపాటు మరికొన్ని సినిమాల్లో బాలనటుడిగా రాణించాడు.
యూఎస్లో వర్క్ చేసి హీరోగా మారి..
బాలనటుడిగా పలు సినిమాల్లో కనిపించిన మనోజ్ పైచదువుల నిమిత్తం యూఎస్కు వెళ్లాడు. తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంలో యూఎస్లోని పలు స్టోర్స్లో వర్క్ చేసి డబ్బు సంపాదించాడు. అలా చదువులు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చిన మనోజ్ సినిమాపై ఉన్న ఆసక్తితో నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2004లో విడుదలైన ‘దొంగా దొంగది’తో హీరోగా తెరంగేట్రం చేశాడు. సదా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సుబ్రహ్మణ్యం శివ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే మనోజ్ ఎందరో ప్రశంసలు అందుకున్నాడు.
విభిన్న కథా చిత్రాలు..
సినిమా, సినిమాకీ ఓ విభిన్నమైన కథతో మనోజ్ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అలా ‘దొంగా దొంగది’ తర్వాత ‘శ్రీ’, ‘రాజు బాయ్’, ‘నేను మీకు తెలుసా?’, ‘బిందాస్’, ‘వేదం’, ఝుమ్మంది నాదం’, ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’, ‘కరెంట్ తీగ’, ‘గుంటూరోడు’, ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రాల్లో నటించాడు. 2010లో విడుదలైన ‘బిందాస్’ చిత్రానికిగాను మొదటిసారి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు.
హీరోనే కాదు లిరిస్టిస్ కూడా..
మనోజ్లో మంచి నటుడే కాకుండా సంగీత ప్రియుడు కూడా ఉన్నాడు. హీరోగా నటించిన పలు సినిమాలకు మనోజ్ పాటలు అందించాడు. అలా వచ్చిన పాటల్లో ‘నేను మీకు తెలుసా’ చిత్రంలోని ‘ఎన్నో ఎన్నో’, ‘మిస్టర్ నూకయ్యా’ చిత్రంలోని ‘పిస్తా పిస్తా’, ‘పోటుగాడు’ సినిమాలోని ‘బుజ్జి పిల్లా’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గాయకుడిగానూ మెప్పించారు.
లేడీ గెటప్లో కనిపించి..
‘పాండవులు పాండవులు తుమ్మెద’ మనోజ్కు ఎంతో ప్రత్యేకమైన చిత్రమనే చెప్పాలి. ఎందుకంటే, హీరోగా మారిన తర్వాత మొదటిసారి తన తండ్రి మోహన్బాబు, సోదరుడు విష్ణుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మనోజ్ లేడీ గెటప్లో సందడి చేశారు. మోహిని పాత్రలో కనిపించి ఆకర్షించారు.
పాన్ ఇండియన్ మూవీ..
‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మనోజ్ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఎంఎంఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో విభిన్నమైన లుక్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
సేవ చేయడంలో ముందుంటూ..
అభిమానులకే కాకుండా ఎవరికీ ఎలాంటి సాయం చేయాలన్నా మనోజ్ ముందుంటారు. ఇటీవలే ఆయన ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. చెన్నై వరదలు, హుద్హుద్ తుపాను సమయంలో తనవంతు సాయం అందించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో చాలామందికి తన కుటుంబసభ్యులతో కలిసి నిత్యావసరాలను అందించాడు. అంతేకాకుండా సోషల్మీడియా వేదికగా ఎవరైనా సాయం కావాలని సంప్రదిస్తే వెంటనే స్పందించి చేతనైన సాయం చేస్తాడు.
నాన్న సినిమా రీమేక్ చేస్తా..
తన తండ్రి మోహన్బాబు నటించిన చిత్రాల్లో ‘యమ్ ధర్మరాజు ఎంఏ’, ‘అల్లుడుగారు’ అంటే తనకి ఎంతో ఇష్టమని మనోజ్ చాలా సందర్భాల్లో చెప్పాడు. వీటిని రీమేక్ చేయడానికి ఇష్టపడుతున్నానని అన్నాడు. ఒకవేళ కనుక ‘యమ్ ధర్మరాజు ఎంఏ’ చిత్రాన్ని రీమేక్ చేయాల్సి వస్తే పూరీ జగన్నాథ్ దానికి సరైన దర్శకుడని మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి