సుద్దాల అశోక్‌ తేజకు అస్వస్థత

ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు శనివారం శస్త్రచికిత్స జరగనుంది. గతకొంతకాలం నుంచి ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో...

Updated : 08 Dec 2022 13:56 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు శనివారం శస్త్రచికిత్స జరగనుంది. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్న అశోక్‌తేజకు.. గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే సుద్దాల అశోక్‌తేజ ఆరోగ్యం గురించి నెట్టింట్లో వస్తోన్న వార్తలపై నటుడు ఉత్తేజ్‌ స్పందించారు.

‘మా మామయ్య సుద్దాల అశోక్‌తేజ అనారోగ్యంగా ఉన్నారంటూ సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలు నిజమే. చికిత్స కోసం ఆయన ఈ రోజు ఆస్పత్రిలో చేరనున్నారు. రేపు సాయంత్రం శస్త్రచికిత్స జరగనుంది. సర్జరీ సమయంలో రక్తం అవసరమవుతుందేమో అని మామయ్య ఇటీవల తన స్నేహితుడితో చెప్పారు. ఈ విషయాన్ని ఆ స్నేహితుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో రకరకాల వార్తలు వస్తోన్నాయి. రక్తం అవసరమున్న మాట వాస్తవమే.. ఆ విషయంపై నేను చిరు బ్లడ్‌బ్యాంక్‌కు కాల్‌ చేశాను. వాళ్లు స్పందించి రక్తదాతలను పంపిస్తామన్నారు. మామయ్య ఆరోగ్యం గురించి తెలిసి చిరంజీవి ఉదయాన్నే కాల్‌ చేశారు. మామయ్యతో మాట్లాడారు. ధైర్యం చెప్పారు.’ అని ఉత్తేజ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని