ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..!

స్టార్ట్‌, కెమెరా, యాక్షన్‌.. ఇలాంటి డైరెక్షన్స్‌ ఏమీ లేకుండానే సినీ, బుల్లితెర తారలు షూట్స్‌లో పాల్గొని వీడియోలతో మెప్పిస్తున్నారు. నోరూరించే వంటకాలను తయారు చేసుకోవడం గురించి...

Published : 26 May 2020 09:04 IST

సెలబ్రిటీల ఇంట.. పసందైన వంట..!

లాక్‌డౌన్‌లో వీడియోలతో మెప్పిస్తున్న తారలు

ఇంటర్నెట్‌డెస్క్‌‌: స్టార్ట్‌, కెమెరా, యాక్షన్‌.. ఇలాంటి డైరెక్షన్స్‌ ఏమీ లేకుండానే సినీ, బుల్లితెర తారలు షూట్స్‌లో పాల్గొని వీడియోలతో మెప్పిస్తున్నారు. నోరూరించే వంటకాలను తయారు చేసుకోవడం గురించి అభిమానులు, నెటిజన్లకు నేర్పిస్తున్నారు. తరచూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే నటీనటులకు లాక్‌డౌన్‌ కారణంగా కొంత ఉపశమనం దొరికింది. దీంతో పలువురు హీరోలు గరిటె చేతపట్టి వంటింట్లోకి అడుగుపెట్టారు. మరోవైపు హీరోయిన్స్‌ సైతం తమకు నచ్చిన వంటకాలను సిద్ధం చేసేస్తున్నారు. ఇలా సినీ, బుల్లితెర సెలబ్రిటీలు తమలోని పాకశాస్త్ర ప్రావీణ్యానికి మెరుగులద్ది రుచికరమైన వంటలతో కుటుంబసభ్యుల్ని, వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు.

ఇటీవల సీనియర్‌ నటుడు మోహన్‌బాబు తన కుటుంబం కోసం ‘కిమా స్టిక్కీ ప్రైడ్‌ రైస్‌’ సిద్ధం చేయగా.. ఆయన తనయుడు విష్ణు కొబ్బరి బొండాంలో చికెన్‌ ర్రైస్‌ వండి వడ్డించారు. నటుడు శివబాలాజీ తనకెంతో ఇష్టమైన ‘గ్రిల్డ్‌ చికెన్‌’తో నోరూరించగా.. ఆయన సతీమణి మధుమిత వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలతోపాటు సూప్స్‌ తయారుచేశారు. బుల్లితెర యాంకర్‌ అనసూయ ‘క్వారంటైన్‌ కుకింగ్‌’లో భాగంగా పలు రకాలైన ఉత్తరాది, దక్షిణాది వంటకాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నోరూరించే ‘చికెన్‌ బిర్యానీ’ సిద్ధం చేసి వంటచేయడంలో నేనేమి తక్కువ కాదని శ్రీముఖి నిరూపించారు. వీరితోపాటు రామ్‌, సుమ సైతం వంటింట్లో గరిటె తిప్పారు. మరోవైపు కాజల్, పూజాహెగ్డే సైతం తమ వంటకాలకు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు.












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని