పూజాహెగ్డే ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌..!

స్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురయ్యింది. టెక్నికల్‌ టీం సాయంతో గంటపాటు శ్రమించి మరలా ఆ అకౌంట్‌ను పునరుద్ధిరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ట్విటర్‌ వేదికగా పలు ట్వీట్లు...

Published : 28 May 2020 10:12 IST

ఆ మెస్సేజ్‌లు నమ్మకండి: నటి

హైదరాబాద్‌: స్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురయ్యింది. టెక్నికల్‌ టీం సాయంతో గంటపాటు శ్రమించి మరలా ఆ అకౌంట్‌ను పునరుద్ధిరించారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో తెలిపారు. ‘హాయ్‌ ఆల్‌!! ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌కు గురయ్యిందని ఇప్పుడే నా టీం  సమాచారమిచ్చింది. ప్రస్తుతం మేము దానిని పునరుద్ధరించే పనిలో ఉన్నాం. కాబట్టి నా అకౌంట్‌ నుంచి వ్యక్తిగతంగా ఎవరికైనా మెస్సేజ్‌లు వస్తే వాటిని నమ్మకండి. అలాగే మీ వ్యక్తిగత సమాచారం చెప్పమని అడిగితే మీరు చెప్పకండి. ధన్యవాదాలు’ అని పూజాహెగ్డే అర్ధరాత్రి 12.37 గంటలకు ట్విటర్‌ వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

కాగా, డిజిటల్‌ టీం సాయంతో తన అకౌంట్‌ పునరుద్ధరించారని పేర్కొంటూ అర్ధరాత్రి 1.05 గంటలకు మరోసారి ట్వీట్‌ చేశారు. ‘హ్యాక్‌కు గురైన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని పునరుద్ధరించడం కోసం గంటపాటు శ్రమించాం. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి పనిచేసిన నా టెక్నికల్‌ టీంకు ధన్యవాదాలు. చివరికి నా అకౌంట్‌ నా చేతుల్లోకి వచ్చింది. గంట క్రితం నా అకౌంట్‌ నుంచి వచ్చిన పోస్టులను, మెస్సేజ్‌లను తొలగించాం’ అని పూజా వివరించారు.

‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మంచి విజయాన్ని పూజా తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వింటేజ్‌ ప్రేమకథాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి ‘జాన్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని