టీకాలు ఇప్పిస్తానంటూ సురేశ్‌బాబుకు టోకరా

టీకాలు ఇప్పిస్తానంటూ ప్రముఖ సినీ నిర్మాత సురేశ్‌బాబుకు ఓ వ్యక్తి టోకరా ఇచ్చాడు.

Updated : 22 Jun 2021 12:59 IST

హైదరాబాద్‌ : టీకాలు ఇప్పిస్తానంటూ ప్రముఖ సినీ నిర్మాత సురేశ్‌బాబుకు ఓ వ్యక్తి టోకరా ఇచ్చాడు. 500 డోసుల టీకాలు ఉన్నాయని సురేశ్‌బాబుకు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన భార్య బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదిలీ చేయాలని కోరాడు. అతడి మాటలు నమ్మి రూ.లక్ష బదిలీ చేశారు సురేశ్‌బాబు. నగదు డ్రా చేసుకున్న తర్వాత నిందితుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. నాగార్జునరెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో సురేశ్‌బాబు సహాయకుడు ఫిర్యాదు చేశారు.

నాగార్జున రెడ్డిని నాలుగు రోజుల క్రితమే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ప్రతినిధిని టీకాల పేరుతో మోసగించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ పీఏ నంటూ నమ్మించి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్ ప్రతినిధిని మోసగించాడు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్‌లో రిమాండ్ ఖైదీగా నాగార్జున రెడ్డి ఉన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని