యోధుడు సిద్ధమయ్యాడు

‘షేర్షా’ చిత్రంలో కెప్టెన్‌ విక్రమ్‌ బత్రాగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు సిద్ధార్థ్‌ మల్హోత్ర. ధైర్యం నిండిన ఆర్మీ అధికారిగా అదరగొట్టిన సిద్ధార్థ్‌ మరోసారి గన్‌పట్టి యాక్షన్‌ సత్తా చూపించబోతున్నాడు.

Published : 02 Dec 2022 02:26 IST

‘షేర్షా’ చిత్రంలో కెప్టెన్‌ విక్రమ్‌ బత్రాగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు సిద్ధార్థ్‌ మల్హోత్ర. ధైర్యం నిండిన ఆర్మీ అధికారిగా అదరగొట్టిన సిద్ధార్థ్‌ మరోసారి గన్‌పట్టి యాక్షన్‌ సత్తా చూపించబోతున్నాడు. కరణ్‌జోహార్‌ దర్శకత్వంతో వస్తోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది జులై7న విడుదల చేయనున్నట్లు గురువారం చిత్రబృందం ప్రకటించింది. సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ, రాశీ ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరితో నటించడం సిద్ధార్థ్‌కు ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం నాయికలిద్దరూ ప్రత్యేకంగా కష్టపడ్డారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరో తాజా సమాచారం ఏంటంటే ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారట నిర్మాత కరణ్‌ జోహార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని