Cinema news: గుండెల్లో నిలిచి.. దివికేగిపోయారు!
పునీత్ రాజ్కుమార్ మరణంతో సినీ, అభిమాన లోకం ఉలిక్కిపడింది! తనొక్కడే కాదు..
పునీత్ రాజ్కుమార్ మరణంతో సినీ, అభిమాన లోకం ఉలిక్కిపడింది! తనొక్కడే కాదు.. అభినయం, నటనతో అలరిస్తూ.. మన ఆయుష్షు పెంచుతున్న తారలెందరో అనారోగ్యంతో అర్థాంతరంగా చుక్కల లోకంలోకి వెళ్లిపోతున్నారు... మీదీ, మాదీ కలకాలం విడదీయలేని బంధం అంటూనే అభిమానుల్ని కన్నీటి సంద్రంలో ముంచేస్తున్నారు... ఈమధ్యకాలంలో అలా మనకు హఠాత్తుగా దూరమైన కొందరు సెలెబ్రెటీల వివరాలు.
శ్రీదేవి.. వయసు: 54
అందం, అభినయంతో అలరించిన అతిలోక సుందరి శ్రీదేవి 54 ఏళ్లకే ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణం తనది. లేడీ సూపర్స్టార్గా అభిమానులతో జేజేలు అందుకున్న అమ్మయ్యంగార్ దుబాయ్లో జరుగుతున్న బంధువుల పెళ్లి వేడుకకు హాజరైంది. అక్కడ హోటల్ గదిలో ప్రమాదవశాత్తు బాత్టబ్లో మునిగిపోయింది. అదేసమయంలో గుండెపోటు రావడంతో ఊపిరాడక చనిపోయింది. సమస్త అభిమానుల్ని నిశ్చేష్టులను చేసింది.
మధుబాల.. వయసు: 36
సౌందర్యానికి మారుపేరుగా, లెజెండరీ నటిగా నీరాజనాలు అందుకున్న నటి మధుబాల. అందం, నటనతో ఎన్నో హృదయాలను రంజింపజేసింది. హాలీవుడ్లో నటించిన తొలి భారతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కాలంలో తనని ప్రఖ్యాత నటి మార్లిన్ మన్రోతో పోల్చేవారు. అంతటి గొప్ప నటి గుండె, కాలేయ సంబంధ వ్యాధులతో 36 ఏళ్లకే అకాల మరణం చెందింది. భారతీయ సినీ లోకాన్ని శోకంలో ముంచెత్తింది.
ఇర్ఫాన్ ఖాన్.. వయసు: 53
భారత్ అందించిన అత్యుత్తమ విలక్షణ నటుల్లో ఒకరిగా ఇర్ఫాన్ఖాన్కి గుర్తింపు ఉంది. రాజస్థాన్లోని చిన్న పట్టణం నుంచి వచ్చి నటనతో శిఖరాగ్రానికి చేరాడు ఇర్ఫాన్. నటన, సినిమా పరిశ్రమతో తనది మూడున్నర దశాబ్దాల బంధం. హాలీవుడ్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పదుల సంఖ్యలో అవార్డులు అందుకున్నాడు. అంత గొప్ప కళాకారుడిపై అనారోగ్యం పంజా విసిరింది. న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్తో రెండేళ్లు పోరాడి గతేడాదే మృత్యు ఒడిలోకి జారిపోయాడు ఖాన్.
ఆర్తి అగర్వాల్.. వయసు: 31
పద్దెనిమిదేళ్లకే తెలుగు చిత్రసీమలో స్టార్ హోదా అందుకున్న నటి ఆర్తి అగర్వాల్. కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు.. చేతి నిండా సినిమాలుండేవి. డేట్స్ సర్దుబాటు చేయలేక సతమతయ్యేది. తర్వాత కొన్ని స్వయంకృతాపరాధాలతో వెనకబడిపోయింది. మానసిక ఒత్తిడికి గురైంది. విపరీతంగా లావు పెరిగిపోవడంతో తగ్గించుకొని మళ్లీ సత్తా చూపాలనుకుంది. బరువు తగ్గడానికి శస్త్రచికిత్సలను నమ్ముకుంది. దురదృష్టవశాత్తు అవి వికటించడంతో తీవ్ర అనారోగ్యాలపాలై చిన్న వయసులోనే అర్థాంతరంగా కన్నుమూసింది.
సిద్ధార్థ్ శుక్లా... వయసు: 40
మోడల్గా మొదలుపెట్టి.. సీరియళ్లు, సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో పేరు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ శుక్లా. బిగ్బాస్ 13 సీజన్ విజేతగా నిలవడంతో స్టార్ హీరోలకు మించి పాపులర్ అయ్యాడు. ఖత్రోం కా ఖిలాడీ, ఇండియాస్ గాట్ టాలెంట్లాంటి రియాలిటీ షోలు, బాలీవుడ్ అవార్డుల కార్యక్రమాలకు తనదైన వ్యాఖ్యానంతో వన్నె తెచ్చిన యాంకర్ కూడా. కెరీర్ ఊపందుకుంటున్న దశలోనే గుండెపోటుతో ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.
చిరంజీవి సర్జా... వయసు: 38
కన్నడ సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడు చిరంజీవి సర్జా. సీనియర్ నటుడు అర్జున్ సర్జాకి దగ్గరి బంధువు. ఎన్నో సూపర్హిట్ చిత్రాల్లో నటించి మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది ఇంట్లోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే గుండెపోటు అతడిని బలి తీసుకుంది. తను చనిపోయే నాటికి భార్య మేఘన ఆరుమాసాల గర్భిణి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు