Ginna: నా మనసుకు దగ్గరైన చిత్రం ‘జిన్నా’
‘ఢీ’ కంటే పది రెట్లు మిన్నగా ‘జిన్నా’ విజయం సాధిస్తుందనేది నా నమ్మకం అన్నారు ప్రముఖ నటుడు మోహన్బాబు. ఆయన సమర్పణలో, తనయుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘జిన్నా’.
మంచు విష్ణు
‘ఢీ’ (Dhee) కంటే పది రెట్లు మిన్నగా ‘జిన్నా’ (Ginna) విజయం సాధిస్తుందనేది నా నమ్మకం అన్నారు ప్రముఖ నటుడు మోహన్బాబు (MohanBabu). ఆయన సమర్పణలో, తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్పూత్ (Payal Rajput), సన్నీలియోన్ (Sunny Leone) కథానాయికలు. ఇషాన్ సూర్య దర్శకుడు. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుందీ చిత్రం. నా కూతుళ్లు అరియానా వివియానా తొలిసారి ఇందులో పాట పాడార’’న్నారు. మోహన్బాబు మాట్లాడుతూ ‘‘ఏ సినిమాకీ కష్టపడనంతగా ఈ సినిమా కోసం సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించాడు విష్ణు. తను మంచి హీరో, మంచి వ్యక్తి. నాగేశ్వర్రెడ్డి కథతో ఓ చిత్రం చేద్దామని కోన వెంకట్ చెప్పారు. దర్శకుడిగా సూర్యని తనే సూచించాడు. అందరూ కష్టపడి పనిచేశారు. మా మనవరాళ్లతో ఈ సినిమాలో పాట పాడించాడు అనూప్. వాళ్లు చాలా బాగా పాడార’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రెండో చిత్రమే ఇంత పెద్ద సినిమా చేసే అవకాశాన్నిచ్చిన మోహన్బాబు, విష్ణులకి నా కృతజ్ఞతలు. దర్శకుడు శ్రీనువైట్ల దగ్గర పనిచేసినప్పుడు నా గురించి కోన వెంకట్కి తెలుసు. ఆయనే నన్ను మోహన్బాబు దగ్గరికి తీసుకెళ్లారు. నాపై నమ్మకంతో ఏ రోజూ నన్ను ప్రశ్నించకుండా సహకారం అందించారు. ఇందులో విష్ణు టైమింగ్ బాగుంటుంది. ఛోటా కె.నాయుడు, ప్రభుదేవా, ప్రేమ్రక్షిత్, సెల్వ, కెచా, రామకృష్ణ, అనూప్ రూబెన్స్ వంటి సీనియర్ సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం ఈ చిత్రంతో లభించింద’’న్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ ‘‘అన్నయ్య మోహన్బాబు నాపై పెట్టిన బాధ్యత ఈ సినిమా. దీంతో మా గుమ్మంలోకి మళ్లీ ఒక విజయం రావాలని వదిన నిర్మల చెప్పారు. మేమందరం తపించి పనిచేశాం. ప్రతి నటుడికి జీవితంలో రెండో ఇన్నింగ్స్ ఉంటుంది. విష్ణు కెరీర్కి ఈ సినిమా ఓ గొప్ప ఇన్నింగ్స్ అవుతుంది. మంచి బృందం తోడైంది’’ అన్నారు. కార్యక్రమంలో అలీ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, జి.నాగేశ్వర్రెడ్డి, ఛోటా కె.నాయుడు, భాను, నందు, కిరణ్, రామకృష్ణ, ఛోటా కె.ప్రసాద్, దివి, చమ్మక్చంద్ర, ఈశ్వర్రెడ్డి, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై మనవడు అవ్రామ్ భక్తతో కలిసి ఆడిపాడారు మోహన్బాబు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత