Chiranjeevi: మరి కొన్నిగంటల్లో ఫంక్షన్‌.. మారిన చీఫ్‌గెస్ట్‌ పేరు

అగ్ర కథానాయకుడు చిరంజీవి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానన...

Published : 26 Jan 2022 15:31 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన పాల్గొనాల్సిన ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మరో నటుడు హాజరు కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇంతకీ ఆ కార్యక్రమం ఏమిటంటే ‘గుడ్‌లక్‌ సఖి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.

కీర్తి సురేశ్‌, జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘గుడ్‌లక్‌ సఖి’. నాగేశ్‌ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో ‘గుడ్‌ లక్‌ సఖి’ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించాలని చిత్రబృందం భావించింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మంది అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని చిత్రబృందం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. అయితే, తాజాగా ఆయన కరోనా బారిన పడినట్లు వెల్లడించడంతో ‘గుడ్‌లక్‌ సఖి’ టీమ్‌ కాస్త ఆందోళనకు గురైంది. ఈ క్రమంలోనే చిరంజీవితోపాటు సదరు చిత్రబృందం రామ్‌చరణ్‌తో మాట్లాడింది. దీంతో చిరంజీవి స్థానంలో రామ్‌చరణ్‌ వచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఈరోజు సాయంత్రం జరగబోయే కార్యక్రమంలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా సందడి చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని