Mahesh babu: దాదాపు 11ఏళ్ల తర్వాత..
టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు. తన తర్వాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు అప్పగించేశారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ‘అతడు’ ఎంత భారీ విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు. తన తర్వాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 11ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఖరారైంది. దీంతో మహేశ్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరూ’తో మహేశ్బాబు, ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇచ్చిన విజయంతో త్రివిక్రమ్ మంచి ఫామ్లో ఉన్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నారు. వచ్చే వేసవికి ఈ సినిమా విడుదల కానుంది. హీరోయిన్, నటీనటుల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. మహేశ్బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’లో బిజీగా ఉన్నారు. కరోనా వల్ల ఆ చిత్రీకరణ వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు త్రివిక్రమ్ పవన్కల్యాణ్, రానా కలయికలో మల్టీస్టారర్గా వస్తున్న చిత్రానికి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఎన్టీఆర్తోనూ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Movies News
Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు