తారక్‌ అభిమానులకు శుభవార్త!

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి రంగం సిద్ధమైంది. విజయవంతమైన ‘జనతా గ్యారేజ్‌’

Updated : 12 Apr 2021 19:14 IST

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి రంగం సిద్ధమైంది. విజయవంతమైన ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రూపొందనుంది. నిజానికి ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్‌ - కొరటాల కలయిక తెరపైకొచ్చింది.  చిరంజీవి, రామ్‌చరణ్‌లతో చేస్తున్న ‘ఆచార్య’ తర్వాత కొరటాల దర్శకత్వం వహించనున్న సినిమా ఇదే అని తెలుస్తోంది. ఈ వేసవిలోనే పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని