Balakrishna: హైదరాబాద్‌లో బాలయ్య చిత్రం

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ  నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా

Updated : 12 May 2022 08:53 IST

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ  నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపు కొంటోంది. ఇందులో భాగంగా ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ - లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బాలకృష్ణపై ఓ భారీ యాక్షన్‌   సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పోరాట ఘట్టమని, బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రామ్‌ - లక్ష్మణ్‌ దీన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. యథార్థ సంఘటనల ఆధారంగా పక్కా మాస్‌     కమర్షియల్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 40రోజుల చిత్రీకరణ పూర్తయింది. ఇందులో భాగంగా రెండు పోరాట ఘట్టాలు తెరకెక్కించారు. ప్రస్తుతం మూడో ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఓ కీలక షెడ్యూల్‌ కోసం త్వరలో విదేశాలకు పయనమవనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని