Veera Simha Reddy: వీరసింహారెడ్డిలో ప్రతిమాట కథలో భాగమే
తొలి అడుగుల్లోనే మాస్ నాడి పట్టిన దర్శకుడు... గోపీచంద్ మలినేని (Gopichand Malineni). కథానాయకుల ఇమేజ్...వాళ్ల అభిమానుల అభిరుచులకి తోడు తన శైలి మాస్ అంశాల్ని జోడిస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు.
తొలి అడుగుల్లోనే మాస్ నాడి పట్టిన దర్శకుడు... గోపీచంద్ మలినేని (Gopichand Malineni). కథానాయకుల ఇమేజ్...వాళ్ల అభిమానుల అభిరుచులకి తోడు తన శైలి మాస్ అంశాల్ని జోడిస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ‘క్రాక్’ (Krack) తర్వాత బాలకృష్ణతో (Balakrishna) జట్టు కట్టగానే ఈ కలయికపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘వీరసింహారెడ్డి’తో (Veera Simha Reddy) ఆ అంచనాల్ని అందుకుని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాకి లభిస్తున్న స్పందనపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు గోపీచంద్ మలినేని.
‘‘ప్రారంభంలోనే ఈ సినిమాని అవకాశంలా కాకుండా ఓ బాధ్యతలా భావించాను. ‘అఖండ’తోపాటు (Akhand) అన్స్టాపబుల్ షో వల్ల బాలకృష్ణపై (Balakrishna) ప్రేక్షకుల్లో మరింతగా క్రేజ్ పెరిగింది. యువతరంలోకి, కుటుంబ ప్రేక్షకులకి మరింతగా కనెక్ట్ అయ్యారు. ఆయనకి ఒకప్పుడు అభిమానులు వేరు, ఇప్పుడు అభిమానులు వేరు. ఇతర హీరోల అభిమానులు కూడా బాలకృష్ణకి అభిమానులయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించా. నాకొచ్చిన అవకాశాన్ని పక్కాగా వాడుకోవాలని, ఒక అభిమానిగా ఆయన్ని ఎలా చూడాలనుకున్నానో అలాంటి మాస్ విషయాల్ని జోడించి ఈ కథ రాసుకున్నా. ‘సమరసింహారెడ్డి’, నరసింహనాయుడు’ సినిమాలు ఆయన కెరీర్లో ఘన విజయాలు. భావోద్వేగాలతో కూడిన ఫ్యాక్షన్ కథలు అవి. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న తరానికి కూడా ఆ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ, గాడ్ ఆఫ్ మాసెస్గా ఆయనకున్న ఇమేజ్ని వాడుకుంటూ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చేశా. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఎంతో తృప్తినిచ్చింది. సినిమా చూశాక చాలా మంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి నన్ను అభినందించారు. సెంటిమెంట్ వాళ్లకి అంతగా చేరువైంది’’.
* ‘‘‘బాలకృష్ణతో (Balakrishna) నేను సినిమా చేస్తున్నానని తెలిశాక... అంతకుముందు నేను చేసిన ‘క్రాక్’ని దృష్టిలో ఉంచుకుని ఇందులోనూ మాస్ - యాక్షన్ అంశాలు అదిరిపోతాయని ఊహించారంతా. ఆ అంచనాలకి తగ్గట్టుగా వాటిని జోడిస్తూనే ద్వితీయార్థంలో అన్నా చెల్లెళ్ల బంధం నేపథ్యంలో కథని చెప్పాం. అది ప్రేక్షకులకి మరింతగా కనెక్ట్ అయ్యింది. బాలకృష్ణ కెరీర్లో ఘన విజయాల్ని అందుకున్న సినిమాల్ని గమనిస్తే...వాటిలో కుటుంబాలకి కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉంటాయి. ఇందులో కూడా అదే అంశం కీలకంగా మారింది. బాలకృష్ణ కంటతడి పెట్టడం, విరామానికి ముందు సన్నివేశాలు చూసి కుటుంబ ప్రేక్షకులు కథ, పాత్రల్ని మరింతగా సొంతం చేసుకున్నారు. అదే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అన్నాచెల్లెళ బంధం అంటే చెల్లెలు కష్టాల్లో పడటం, ఆమెని కథానాయకుడు రక్షించడం చూస్తుంటాం. కానీ ఇందులో కథ అందుకు విరుద్ధంగా సాగుతుంది. ఇలాంటి అంశాన్ని పక్కాగా తెరపైకి తీసుకురావడం కత్తిమీద సాము. నేను, బాలకృష్ణ, నిర్మాతలు కథని బలంగా నమ్మాం. వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) తన నటనతో ఆ పాత్రపై అంతే ప్రభావం చూపించింది. ప్రేక్షకులతో కంటతడి పెట్టించడం అంత సులభం కాదు. ప్రథమార్థం వరకు నేనొక అభిమానిగా పనిచేశా, ద్వితీయార్థంలో నాలోని దర్శకుడు కనిపిస్తాడు’’.
* ‘‘నాలో చాలా మాస్దనం ఉంది. ఈ కథకి ఎంత కావాలో అంతే తీసుకొచ్చా. భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తారు. స్వతహాగా నేను మాస్ సినిమాలకి పెద్ద అభిమానిని. అలాంటి సినిమాలే ఎక్కువగా చూస్తా. చిత్ర పరిశ్రమలో అందరు మాస్ హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. ఒకొక్క కథతో ఒక్కో మాస్ కోణాన్ని ఆవిష్కరిస్తా. తదుపరి సినిమాపై ఇంకా దృష్టిపెట్టలేదు. ప్రస్తుతం సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నా’’.
* ‘‘కథలో భాగంగానే సంభాషణలు రాశారు రచయిత సాయిమాధవ్ బుర్రా. కావాలని ఏ ఒక్క మాటని జోడించలేదు. బాలకృష్ణ గెటప్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ముందే స్కెచ్లు వేసుకుని కథ, పాత్రల రీత్యా లుక్ని డిజైన్ చేశాం. ఒక్కసారి కనెక్ట్ అయితే సాంకేతిక నిపుణుల్ని మార్చను. తమన్, రామ్లక్ష్మణ్, ప్రకాశ్... వీళ్లతో మొదట్నుంచీ నా ప్రయాణం కొనసాగుతోంది. నేను పనిచేసినవాళ్లలో అత్యుత్తమం ఈ నిర్మాతలు. ‘క్రాక్’ విడుదలకి ముందే నన్ను పిలిచి సినిమా చేద్దామన్నారు. నేను అభిమానించే బాలకృష్ణ, పవన్కల్యాణ్ల కోసం కథలు సిద్ధం చేసుకున్నానని చెప్పినప్పుడు మొదట బాలకృష్ణతో సినిమా చేద్దామని ముందుకొచ్చారు. ఈ సంస్థలో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటా. నేను అభిమానించే పవన్కల్యాణ్తోనూ తప్పకుండా సినిమా చేస్తా. బాలకృష్ణపై నాకున్న అభిమానాన్ని మా అబ్బాయి పాత్రతో చూపించా (నవ్వుతూ). తన అమ్మ, నాన్నల చావుకి కారణమైన ఓ రాక్షసుడిపై పగ పెంచుకుని కథానాయకుడిని ఆశ్రయించే బాలుడిగా మా అబ్బాయి చాలా బాగా నటించాడు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!