NTR30లో రీల్‌ లేడీ పొలిటిషియన్‌?

‘అరవింద సమేత’ తర్వాత తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్నట్లు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ త్వరలోనే ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. NTR30గా...

Published : 05 Mar 2021 16:04 IST

జోరందుకున్న ప్రచారం

హైదరాబాద్‌: ‘అరవింద సమేత’ తర్వాత తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్నట్లు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ త్వరలోనే ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. NTR30గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయంపై నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ పవర్‌ఫుల్‌ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

‘క్రాక్‌’, ‘నాంది’ చిత్రాల్లో వరలక్ష్మి నటన చూసి ఫిదా అయిన త్రివిక్రమ్‌ NTR30లో ఓ రోల్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకురాలిగా కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు.. ‘సర్కార్‌’, ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ చిత్రాల్లో రాజకీయ నాయకురాలి పాత్రను పోషించి వరలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్న విషయం విధితమే. ఇక, తారక్‌ సినిమా విషయానికి వస్తే.. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని