ఒకే మార్గం...ఒకే లక్ష్యం...పరచూరి బ్రదర్స్
ఔను... వారిద్దరి దేహాలు వేరయినా ఆత్మ ఒకటే. చేపట్టిన వృత్తి ఒకటే. చేరుకోవాలన్న లక్ష్యం ఒక్కటే. తెలుగు చిత్ర సీమలో 350కి పైగా చిత్రాలకు కధలు, మాటలు అందించిన రచయితల ద్వయం పేరు... పరచూరి బ్రదర్స్. ఒంటి పేర్లతో కాకుండా కేవలం ఇంటి పేరుతోనే
రెండు శరీరాలు... ఒకే ప్రాణం...
రెండు హృదయాలు... ఒకే స్పందన...
రెండు మెదళ్ళు... ఒకే ఆలోచన...
రెండు కలాలు... ఒకే సృజన...ఒకే మార్గం...ఒకే లక్ష్యం...పరచూరి బ్రదర్స్
ఔను... వారిద్దరి దేహాలు వేరయినా ఆత్మ ఒకటే. చేపట్టిన వృత్తి ఒకటే. చేరుకోవాలన్న లక్ష్యం ఒక్కటే. తెలుగు చిత్ర సీమలో 350కి పైగా చిత్రాలకు కధలు, మాటలు అందించిన రచయితల ద్వయం పేరు... పరచూరి బ్రదర్స్. ఒంటి పేర్లతో కాకుండా కేవలం ఇంటి పేరుతోనే లబ్ధ ప్రతిష్ఠులైన ఆ రచయితల సృజనకి సంబంధించి ఒక చిత్రానికి ఎవరు ఎంత మేర తమ కాంట్రిబ్యూషన్ ఇచ్చారో... తేల్చి చెప్పడం... మనకే కాదు ఆ రచయితల ద్వయానికి కూడా అంతు పట్టని కథే. ఇద్దరు వ్యక్తులుగా పైకి కనిపించినా... రచయితలుగా ఒకే పేరుతో ప్రతిష్ట సంపాదించుకున్నారు కనుక... ఎవరి గురించి మాట్లాడబోయినా మరొకరి ప్రస్తావన తప్పనిసరవుతుంది. అంతలా ఒక్కరుగా ఆ ఇద్దరూ మమేకమై పోయారు. వ్యక్తిగత గుర్తింపు కన్నా మిన్నగా జంట గుర్తింపునే కోరుకున్నారు. అదే బాటలో నడిచారు. ఇంకా...నడుస్తూనే ఉన్నారు.
నామ త్యాగం..
జంటగా కళా సేవ చేసినవారిలో చాలామంది ఆ తర్వాత్తర్వాత విడిపోయి ఎవరికివారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సృజనాత్మక భేదాలు, వ్యక్తిగత ఈర్ష్యాద్వేషాలు, వివిధ భావోద్వేగాలతో విడిపోతుంటారు. వీటన్నిటికీ అతీతంగా పరచూరి బ్రదర్స్ ఇప్పటికీ ఒక్కటిగా ఉండడమే... జంట రచయితలుగా వారి విజయ రహస్యమంటారు. రవీంద్రభారతిలో జరిగిన ఒకనొక సభలో ప్రసిద్ధ కవి డాక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ... అన్నదమ్ముల కోసం ఎంతో మంది ఆస్తులు త్యాగం చేశారు. భూములు త్యాగం చేశారు. కానీ, పరుచూరి బ్రదర్స్ మాత్రం నామ త్యాగం చేశారు అంటూ అభినందించారు.
పరచూరి బ్రదర్స్లో ఒకరైన... పరచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు 21 జూన్. నాటక రచయిత, నటుడు, సంభాషణల రచయిత, దర్శకుడు... ఇలా అనేక రకాలుగా సినిమా సేవకు వెంకటేశ్వరరావు అంకితమయ్యారు. సన్నివేశానికి తగ్గట్లు మాటల తూటాలు పేల్చడం, హీరోలకు వ్యక్తితం ఉన్న పవర్ ఫుల్ పాత్రల్ని రూపొందించడం... ఉత్కంఠ గొలిపే కధాకధనాలతో ప్రేక్షకులని కదలనీయకుండా చేయడం... ఈ జంట కలానికి ఉన్న ప్రత్యేకత. సినీరచనలో ఉన్న దమ్ముని అన్నదమ్ములు చూపించారు.
ఇండస్ట్రీకి వెంకీ...గోపీ..
ఇండస్ట్రీ ఈ ఇద్దరు అన్నదమ్ములని వెంకీ, గోపి... అంటూ ఆత్మీయంగా పిలుచుకుంటుంది. వెంకటేశ్వరరావులోని ముక్కుసూటి తనం ప్రత్యేకత. ఉన్న మాట మనసులో దాచుకోకుండా పైకి వ్యక్తం చేసే తత్త్వం ఆయనది. గుంభనగా ఉండడం చేతకాదంటారు. అదే సమయంలో... పిలిస్తే కోపం ఇట్టే వచ్చేస్తుందంటారు. మంచితనం...మానవత్వం పోత పోసిన నిలువెత్తు మనిషి ఆయన. ఇండస్ట్రీకి పరచూరి గోపాల కృష్ణ కంటే ముందుగానే వచ్చిన వెంకటేశ్వరావు తర్వాత సోదరుడితో కలిసి అనేక సంచలనాలు కారణమయ్యారు.
మొదట్లో ఎర్ర సినిమాలు..
కెరీర్ బిగినింగ్లో పరచూరి బ్రదర్స్ ఎన్నో విప్లవాత్మక సినిమాలకు రచన చేశారు. చలిచీమలు, మరో మలుపు, ఈ చరిత్ర ఏ సిరాతో?, ఇది కాదు ముగింపు, రోజులు మారాయి... అనే సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్లు లేకున్నా జనాదరణ పాత్రమయ్యాయి. తక్కువ బడ్జెట్, అందుబాటులో ఉన్న లొకేషన్స్, అభిరుచిగల నటీనటులు... ఇవీ ఈ సినిమాలకు ప్రధాన ఆకర్షణలు. అగ్ర హీరోల సినిమాలతో పోటీ పడుతూ విజయ ఢంకా మోగిస్తూ ముందుకు సాగుతుంటే... ఇండస్ట్రీ కన్ను ఈ రచయితల మీద పడింది. అంతే...ఇక ఈ రచయితలకు అహర్నిశలూ పనే. ఇండస్ట్రీలో బిజీ రచయితలుగా మారిపోయారు. 1978 జులై 7న విడుదలైన చలి చీమలు చిత్రంతో వీరి ఎంట్రీ జరిగింది. 1979లో కలియుగ మహాభారతం, ఛాయ, సీతే రాముడైతే, 1980లో బడాయి బసవయ్య, సమాధి కడతాం చందాలివ్వండి., మానవుడే మహనీయుడు, 1981లో భోగభాగ్యాలు, మరో కురుక్షేత్రం లాంటి సినిమాలకు రచనలు చేస్తూ వచ్చారు. 1982లో ఎన్టీఆర్, శ్రీదేవి, జయప్రద నటించిన అనురాగ దేవత సినిమాకు సంభాషణలు సమకూర్చారు. ఆ తర్వాత నాదేశం సినిమాకు కూడా రచన చేశారు. 1982లో ఈనాడు సినిమాకి పనిచేసారు. 1983లో ముందడుగు సినిమాతో కమర్షియల్గా ఓ ముందడుగు పడింది. డి. రామానాయుడు నిర్మాతగా, కె. బాపయ్య దర్శకతంలో కృష్ణ, శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి నటించిన ఈ చిత్రానికి పరచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. 1983లో ఈ సినిమా విడుదలయింది. ఈ దేశంలో ఒకరోజు, చట్టానికి వెయ్యి కళ్ళు, చండశాసనుడు, సిరిపురం మొనగాడు, ప్రజారాజ్యం కాలయముడు...ఇలా రాస్తూ పోతుండగా 1983లో చిరంజీవి ఖైదీకి కథ, మాటలు అందించారు. అప్పటి ఖైదీతో పాటు ఖైదీ నంబర్ 150కి కూడా పరచూరి బ్రదర్స్ పనిచేశారు. చిరంజీవి లేటెస్ట్ సినిమా సైరాకి కూడా పరచూరి బ్రదర్స్ కథని అందించారు.
ఓ పుట్టిన రోజునాడు నీడ దొరికింది..
చలి చీమలు చిత్రం తర్వాత ఎన్టీఆర్ పరుచూరి కోసం వెతకడం మొదలెట్టారు. ఆఖరికి వెంకటేశ్వరావుని ఎన్టీఆర్ మనుషులు కనుగొన్నారు. వెంటనే... ఆయన్ని ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు... ఆయన గొడుగు నీడలో ఉన్నారు. పరచూరి వెంకటేశ్వరావు మాత్రం ఎండలో నిల్చున్నారు. అది గమనించిన ఎన్టీఆర్ నీడలోకి రండి... అంటూ సూచించారు. ఆ సూచనకే పులకించిపోయారు వెంకటేశ్వరావు. కారణం... ఎండ నుంచి నీడలోకి రమ్మనే అర్థం పైకి కనిపిస్తున్నా... ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నీడ కూడా లభించబోతోందనే అంతర్లీన సంకేతం అందులో ఉందని వెంకటేశ్వరరావు భావించారు. కాలక్రమేణా ఆ భావమే నిజమైనది. తర్వాత్తర్వాత ఎన్టీఆర్ నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఈ రచయితల ద్వయం రచన చేశారు.
దర్శకులుగా..
దర్శకులుగా కూడా ఈ రచయితల ద్వయం అనేక సినిమాలు రూపొందించారు. కాయ్ రాజా కాయ్, శ్రీ కట్న లీలలు, భలే తమ్ముడు, రేపటి స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, మా తెలుగు తల్లి, సర్పయాగం, మరో క్విట్ ఇండియా, సింగన్న చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటులుగా పలుచిత్రాల్లో మంచి పాత్రలు వేశారు. 1993లో ఆశయం సినిమాలో నటించిన పరచూరి వెంకటేశ్వరరాఫుకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా అవార్డు లభించింది.
ఉత్తమ కథా రచయితలుగా నందులతో పురస్కారం..
1986లో ప్రతిధ్వని సినిమాకి కథని అందించినందుకు ఉమ్మడి రాష్ట్ర నంది పురస్కారం లభించింది. 1990లో కర్తవ్యం సినిమాకి మరో నంది నడిచి రాగా ...చెన్నయ్ లోని కళాసాగర్ అవార్డు కూడా వరించి వచ్చింది. 1993లో ఆశయం సినిమాకి కథ అందించినందుకు నంది అవార్డుతో పాటు సినీ గోయర్స్ అవార్డు కూడా లభించింది. 1990లో కొదమ సింహం సినిమాకి బెస్ట్ స్క్రీన్ప్లే రైటర్స్గా వంశీ బర్కలీ పురస్కారం లభించింది. బెస్ట్ ఫిలిం డైరెక్టర్గా ప్రజాస్వామ్యం సినిమాకి మరోసారి నంది పురస్కారాన్ని పరచూరి బ్రదర్స్ అందుకున్నారు. బెస్ట్ డైలాగ్ రైటర్స్గా ఈనాడు చిత్రానికి సితార అవార్డు, ప్రజాస్వామ్యం సినిమాకి రసమయి అవార్డు, కర్తవ్యం, పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాలకి కళాసాగర్ అవార్డు, సుందరకాండ సినిమాకి లలిత కళాసాగర్ అవార్డు, కుంతీ పుత్రుడు సినిమాకి వంశీ బర్కలీ అవార్డు, మేజర్ చంద్రకాంత్ కి కళాసాగర్ అవార్డు, గణేష్ చిత్రానికి నంది అవార్డు, సమరసింహారెడ్డికి యువకళావాహిని, అప్ సినీ గోయర్స్ అవార్డు...ఇలా అనేకానేక సాంస్కృతిక సంస్థలు పరచూరి బ్రదర్స్ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తుగా సన్మానించాయి.
బుల్లితెరపై కూడ పరచూరి సృజన
బుల్లి తెర పై కూడా పరచూరి బ్రదర్స్ సృజన అందించారు. సంభవామి పదేపదే, శశిరేఖ పరిణయం, ప్రజావేదిక, సతీ సావిత్రి...ఇలా అనేక సీరియల్స్, కార్యక్రమాలకు ప్రతిభ అద్దారు.
ఈ తరం అగ్రహీరోలకు పెద్దనాన్నలు
ఇప్పట్లో అగ్ర హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు పరచూరి బ్రదర్స్ పెద్దన్నన్నలు. కృషంరాజు, హరికృష్ణలతో ఉన్న అనుబంధం కారణంగా వాళ్లంతా ఈ ఇద్దర్నీ పెద్దనాన్నలుగా పిలుస్తూ ఆప్యాయత పంచుతారు.
- పి.వి.డి.ఎస్. ప్రకాష్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Puneeth Rajkumar: పునీత్ బయోపిక్ తీసే ప్రయత్నం చేస్తా!
కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నటుడిగా మెప్పించడమే కాదు.. నిజజీవితంలో తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారాయన. -
Puneeth Rajkumar: పునీత్ కళ్లతో నలుగురికి కంటిచూపు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హీరోగానే కాదు.. సేవల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. బతికున్నంత కాలం ఎంతో మంది ఆదుకుని ‘పునీత’డనిపించుకున్న ఆయన.. చనిపోతూ కూడా నలుగురి జీవితాల్లో వెలుగునింపారు. -
Sonusood: ఇకపై ఉచితంగా ఈఎన్టీ సర్జరీలు
చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన ఈఎన్టీ సర్జరీలను ఉచితంగా ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా అందిస్తున్నట్లు మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. -
ఆమంచి... మా మంచి హాస్య నటుడు
ఆయనని తలచుకోగానే మనకు తెలీకుండా పెదాలపై చిరునవ్వులు చిందుతాయి. ఎన్ని బాధల్లో ఉన్నా చిటికలో మనసు ఉల్లాసభరితమవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆయన మంచి హాస్యానికి అసలు సిసలైన చిరునామా. అందుకే... అంటారు ప్రేక్షకులంతా -
అసంపూర్ణ చిత్రం...ఉదయ్ కిరణ్
ఉదయించి మధ్యాహ్నానికి చేరకుండానే... మబ్బులు కమ్మి చిక్కటి చీకట్లు అలముకున్నట్టు అర్ధాంతరంగా అంతర్ధానమైన ఓ కిరణం గురించి తలచుకుంటేనే గుండెలు బరువెక్కుతాయి. కన్నీళ్లు కనురెప్పల్ని తడిమేస్తాయి. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ యువకుడు... -
బుర్రిపాలెం బుల్లోడు... అద్భుతాల అసాధ్యుడు
అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాల జుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే -
తలకట్టు కనికట్టు... కోడి రామకృష్ణ
ఎప్పుడూ తెల్లని దుస్తులు... దర్శకత్వం చేస్తున్నప్పుడు మాత్రం తలకో కట్టు. ఆ కట్టుతోనే కనికట్టు చేసి తన సినిమాల్ని విజయవంతం చేసుకున్నారాయన. హెడ్ బాండ్ లేని కోడి రామకృష్ణను ఊహించలేం. షూటింగ్ స్పాట్కి వచ్చిన ఆయన నుదుటి చుట్టూ ఓ కట్టు కడితే -
సాహిత్య మారుతి... గొల్లపూడి
ఆయన ఒక కథా రచయిత, ఒక నవలా రచయిత, ఒక రంగస్థల నాటక రచయిత, ఒక వక్త, ఒక పాత్రికేయుడు, ఒక సినిమా రచయిత, ఒక సినిమా నటుడు, ఒక బుల్లితెర ప్రయోక్త. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు. ఈ-టీవీ వారు నిర్వహించిన ‘ప్రతిధ్వని’ -
చిత్రసీమకు ‘గురువుగారు’!
సినిమాకి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్..’ దర్శకుడే అని అందరూ చెబుతారు. కానీ అదే నిజం అని చేతల్లో చూపించిన దర్శక శిఖరం... దాసరి నారాయణరావు. వెండితెరపై కథానాయకులుగా మెరుస్తూ ఓ ఇమేజ్ని ఏర్పాటు చేసుకొంటేనే స్టార్ అవుతారు కదా? తెర వెనక ఉంటూ -
భాగ్యనగర సినీ భగీరథుడు... అక్కినేని
1945లో పూర్తిస్థాయి నటుడిగా ‘మాయాలోకం’లో విహరించిన అక్కినేని, పల్లెటూరి నేపధ్యంలో నటించిన మొదటి చిత్రం దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు నిర్మించిన ‘పల్లెటూరిపిల్ల’గా చెప్పవచ్చు. అక్కినేనికి ఇది 12వ చిత్రం కాగా, ఎన్.టి.ఆర్తో కలిసి నటించిన మొదటి మల్టీ -
వెండితెరపై... సీమ పెతాపం
రాయలసీమ... తెలంగాణ... నెల్లూరు...యాస ఏదైనా సరే... ఆయన నోటి నుంచి వచ్చిందంటే ‘లెస్స పలికారు’ అంటూ చప్పట్లు కొట్టాల్సిందే! ప్రతినాయకుడిగానైనా... హాస్య పాత్రలైనా... ఆయన చేశారంటే... వాటిలో హావభావాలు పోత పోసినట్టే! విలక్షణ నటనకి నిలువెత్తు రూపంలా కనిపించే ఆయనే... జయప్రకాష్రెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ జేపీగా పిలుచుకునే ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!