Gunasekhar: ఇది సమంత శాకుంతలం
‘‘బాహుబలి’తో తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’తో దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.
గుణశేఖర్
‘‘బాహుబలి’తో తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’తో దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అలాగే తెలుగు చిత్రాల్ని ఇంకా ప్రపంచానికి చూపిస్తూ ఉండాలనే ఉద్దేశంతో నేను వేసిన తొలి అడుగు ఈ ‘శాకుంతలం’’ అన్నారు నిర్మాత దిల్రాజు (Dil Raju). ఆయన సమర్పణలో సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం (Shaakuntalam) ఆధారంగా దీన్ని త్రీడీలో రూపొందించారు. నీలిమ గుణ నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో త్రీడీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఇది సమంత శాకుంతలం. ఈ చిత్రం వెనకాల మొత్తం తనే ఉంది. ఆమె ప్రాణం పెట్టి శకుంతల పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. దాన్ని రేపు మీరు తెరపై తొలి సీన్ నుంచి చివరి సన్నివేశం వరకు అనుభూతి చెందుతారు. ఇప్పుడదే మచ్చుకు ట్రైలర్లో చూశారు. ఇక ఇప్పుడేం మాట్లాడను. ఏప్రిల్ 14న సినిమా చూపించాక ప్రేక్షకుల స్పందనను వినాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ఒక అద్భుతమైన చిత్రం చూశామన్న అనుభూతి పంచి థియేటర్ నుంచి బయటకు పంపిస్తుంది’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. చిత్ర సమర్పకులు దిల్రాజు మాట్లాడుతూ.. ‘‘సమంతతో గుణశేఖర్ చిత్రం చేయాలనుకున్నప్పుడు ఇందులో నేను లేను. గ్లోబల్ సినిమా గురించి తెలుసుకోవడానికి, వీఎఫ్ఎక్స్ నేర్చుకోవడానికి ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యాను. ఇదొక అందమైన ఫ్యామిలీ డ్రామా. విజువల్ వండర్లా తీర్చిదిద్దారు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ కొట్టించదు. ఈ చిత్రం చూసి బయటకొచ్చేటప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ సర్ప్రైజ్ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ద్వారా మన సంస్కృతిని వేడుక చేసుకుంటున్నాం. దీన్ని త్రీడీలోకి మార్చాలన్న ఆలోచన దిల్రాజుదే. అందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాత నీలిమ గుణ. ఈ కార్యక్రమంలో చైతన్య ప్రసాద్, ప్రవీణ్ పూడి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).