Gurtunda Seetakalam: అడివి శేష్ వరుస ‘హిట్’లు కొట్టేందుకు కారణమదే: సత్యదేవ్
‘గుర్తుందా శీతాకాలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్: అడివి శేష్ (Adivi Sesh) తనకు మంచి స్నేహితుడని, అతను ఏ కథ ఓకే చేస్తే అది హిట్ అవుతుందని సత్యదేవ్ (Satya Dev) అన్నారు. ‘గుర్తుందా శీతాకాలం’ (Gurtunda Seetakalam) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన మాట్లాడారు. సత్యదేవ్ హీరోగా దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించిన చిత్రమిది. తమన్నా, మేఘా ఆకాశ్, కావ్య కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు అడివి శేష్ అతిథిగా హాజరయ్యారు.
సత్యదేవ్ బాగా బిజీ...
‘‘నేను యూఎస్లో ఉండి, సినిమాలు చేయాలని కలలు కంటున్నప్పుడు ‘హ్యాపీడేస్’తో తమన్నా నాకు స్ఫూర్తినిచ్చింది. మేం ఐదారేళ్లకు ఒకసారి కలుసుకుంటూ ఉంటాం. ఈసారి ఒకే సినిమా సెట్స్లో కలుసుకోవాలని కోరుకుంటున్నా. నా చిత్రం ‘క్షణం’లో సత్యదేవ్ నటించాడు. ఆ తర్వాత తన కెరీర్ ఊపందుకుంది. ‘ఎవరు’ సినిమా కోసం సంప్రదించా. ఉత్తరాదిలో సినిమాలు చేస్తున్నా అని బదులిచ్చాడు. ‘మేజర్’ సినిమా కోసం ప్రయత్నించినప్పటికి తను హీరో అయిపోయాడు. ‘హిట్ 2’ కోసం అడుగుదామనుకుంటే .. ‘గాడ్ ఫాదర్’లో మెయిన్ విలన్గా చేస్తున్నాడని తెలిసి షాక్ అయ్యా (నవ్వుతూ..). ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని శేష్ అన్నారు.
శేష్ వచ్చాడు.. హిట్ అవుతుంది: సత్యదేవ్
‘‘శేష్ నాకు మంచి స్నేహితుడు. దర్శకులు తనకు కథ చెబితే ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. అందులోని లోపాలను చెబుతాడు. అలా చేయడం వల్లే వరుస హిట్లు అందుకున్నాడు. ఆయనకు విజయం వస్తే నాకు వచ్చినట్టుగానే భావిస్తా. ఆయన పట్టుకున్న స్టోరీ హిట్ అవుతుంది. మా సినిమా ఈవెంట్కు వచ్చాడు కాబట్టి ఇదీ విజయం అందుకుంటుందనుకుంటున్నా. తమన్నా, మేఘా ఆకాశ్, కావ్యలు ఈ సినిమాకు కీలకం. ఆ తర్వాతే నేను. పాత్రలే కనిపిస్తాయి తప్ప నటులు కనిపించరు’’ అని సత్యదేవ్ చెప్పారు.
‘‘నేను వేసవిని తప్ప శీతాకాలాన్ని ఇష్టపడేదాన్ని కాదు. ఈ సినిమాలో నటించిన తర్వాత వింటర్ నచ్చింది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలోని సత్యదేవ్ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అప్పుడే ఆయనతో కలిసి నటించాలనుకున్నా. అనుకున్న కొన్ని రోజుల్లోనే ‘గుర్తుందా శీతాకాలం’ అవకాశం వచ్చింది’’ అని తమన్నా అన్నారు. ‘‘నన్ను ఇప్పటి వరకూ ఆదరించిన కన్నడ ప్రేక్షకులు, నిర్మాతలు, నన్ను ఆహ్వానిస్తున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ వారికి కృతజ్ఞతలు. సత్యదేవ్ నుంచి తెలుగు మాట్లాడడం నేర్చుకున్నా. శీతాకాలం అంటే నాకు బాగా ఇష్టం. అందుకే ఆ సీజన్లోనే నా సినిమాలను షూట్ చేస్తా. వేసవిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తుంటా’’ నాగశేఖర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని