Harish Shankar: వెబ్‌సిరీస్‌తో అలరించనున్న హరీశ్‌ శంకర్‌

‘గబ్బర్‌సింగ్‌’, ‘గద్దలకొండ గణేశ్‌’ వంటి కమర్షియల్‌ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించిన ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ప్రస్తుతం ఆయన ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌తో....

Published : 27 Jan 2022 11:57 IST

హైదరాబాద్‌: ‘గబ్బర్‌సింగ్‌’, ‘గద్దలకొండ గణేశ్‌’ వంటి కమర్షియల్‌ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించిన ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ప్రస్తుతం ఆయన ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. భారీ దొంగతనం నేపథ్యంలో సాగే కథతో ఆయన ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 కోసం హరీశ్‌ శంకర్‌ ఓ కథ సిద్ధం చేశారు. సి.చంద్రమోహన్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ‘ఏటీఎం’ పేరుతో ఈ సిరీస్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం ‘ఏటీఎం’ టైటిల్‌ పోస్టర్‌ని హరీశ్‌ శంకర్‌ నెటిజన్లతో పంచుకున్నారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షితారెడ్డి, హరీశ్‌ శంకర్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని