MAA Elections: ‘మా ఎన్నికలు: ప్రకాశ్రాజ్ ప్యానెల్లో హేమ, జీవితా రాజశేఖర్
MAA Elections: రాబోయే ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్రాజ్ తన ప్యానల్ను ప్రకటించారు.
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన నటీమణులు హేమ, జీవితా రాజశేఖర్ ప్రకాశ్రాజ్ ప్యానెల్ నుంచి బరిలో నిలిచారు. ఈ విషయాన్ని ప్రకాశ్రాజ్ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం ‘‘సిని‘మా’బిడ్డలం’’ పేరుతో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్యానెల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ప్రకటించారు.
‘‘ఇండస్ట్రీకి సేవ చేయాలనే వచ్చా. సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉంది. మాకు అవకాశం ఇస్తే అది చేసి చూపిస్తాం. గతంలో కొందరు సభ్యులతో విలేకరుల ముందుకు వచ్చా. వారు ప్యానెల్ సభ్యులు కాదు. కేవలం నా శ్రేయోభిలాషులు మాత్రమే. ఇప్పుడు ‘మా’ ప్యానెల్ను ప్రకటిస్తున్నా. ఇందులో మహిళలకూ సమాన అవకాశం ఇస్తున్నాం. అందరూ హేమ, జీవితా రాజశేఖర్ అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేస్తారని భావించారు. ఈ విషయమై హేమతో నేను మాట్లాడా. ‘మనందరం కలిసి ఉండాలి మీరేమంటారు’ అని అడిగాం. ‘నేను ప్రెసిడెంట్గా పోటీ చేయను. మీ ఆలోచనలు నాకు నచ్చాయి. మీ ప్యానెల్లో పోటీ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని హేమ చెప్పారు. ఆమె చాలా ధైర్యవంతురాలు. గతంలో పని చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే మా ప్యానెల్లో తీసుకున్నాం. ఇక జీవితా రాజశేఖర్ కూడా అధ్యక్ష బరిలో ఉంటారని అనుకున్నారు. ఆమెతో రెండు గంటలకు పైగా మాట్లాడా. మా కార్యచరణను ఆమె ముందు ఉంచాను. ఆ విషయాలన్నీ ఆమెకు నచ్చాయి. దీంతో నా ప్యానెల్లో పోటీ చేయడానికి ఒప్పుకొన్నారు. రాజశేఖర్ కూడా ఇందుకు మద్దతు ఇస్తానని అన్నారు’’ అని ప్రకాశ్రాజ్ వివరించారు.
అధికార ప్రతినిధులుగా సాయికుమార్.. బండ్ల గణేశ్
తాము పోటీ చేస్తే బాగా పనిచేసేవారికి అవకాశం లేకుండా పోతుందని సినీ నటులు సాయికుమార్, బండ్ల గణేశ్ తనతో చెప్పినట్లు ప్రకాశ్రాజ్ అన్నారు. అందుకే వారిని అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నట్లు వివరించారు. సాయికుమార్, బండ్లగణేశ్, సన, శ్రీరామ్ ఏడిద వీరంతా తమకు తోడుగా ఉంటామన్నారని వివరించారు. త్వరలోనే అందరితోనూ కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకాశ్రాజ్ తెలిపారు. తమ ప్యానెల్ ఎజెండా ఏంటి? ఏయేం పనులు చేస్తాం? అన్నీ అప్పుడు వివరిస్తానన్నారు. ‘మా’ ప్యానెల్కు సంబంధించిన ఏది చెప్పాలన్నా తికమక లేకుండా కేవలం అధికార ప్రతినిధులే మాట్లాడతారని ప్రకాశ్రాజ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మెయిన్ ప్యానెల్ సభ్యులు
* అధ్యక్షుడు- ప్రకాశ్రాజ్
* ట్రెజరర్-నాగినీడు
* జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి
* జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్
* ఉపాధ్యక్షుడు: బెనర్జీ
* ఉపాధ్యక్షురాలు- హేమ
* ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్- శ్రీకాంత్
* జనరల్ సెక్రటరీ- జీవితా రాజశేఖర్
ప్రకాశ్రాజ్ ప్యానెల్లో ఈసీ మెంబర్స్ (ఎగ్జిక్యూటివ్ సభ్యులు)
* అనసూయ (వ్యాఖ్యాత, నటి)
* అజయ్
* బి.భూపాల్
* బ్రహ్మాజీ
* బుల్లితెర నటుడు ప్రభాకర్
* గోవిందరావు
* ఖయ్యూం
* కౌశిక్
* ప్రగతి
* రమణారెడ్డి
* శివారెడ్డి
* సమీర్
* సుడిగాలి సుధీర్
* డి.సుబ్బరాజు
* సురేశ్ కొండేటి
* తనీశ్
* టార్జాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం