Mahesh babu: మహేశ్బాబు హీరో మాత్రమే కాదు.. అంతకుమించి..!
దూమపానం, మద్యపానం, ఆరోగ్యానికి హానికరం అని సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ తెరపై వేస్తారు.. కానీ సినిమాల్లో మాత్రం హీరోలే సిగరెట్లు కాలుస్తారు. మద్యం తాగి సీసాలు పగలగొడుతారు. అయితే.. అలాంటి సన్నివేశాల్లో నటించబోనని తేల్చి చెప్పిన ఏకైక హీరో మహేశ్బాబు. ఇది చాలు కదా.
ఇంటర్నెట్ డెస్క్: మహేశ్ పేరులో ఉంది మూడు అక్షరాలే.. కానీ, అమ్మాయిలకు అతను కలల ‘రాకుమారుడు’. అబ్బాయిలకు ‘బిజినెస్మెన్’లా రోల్మోడల్. అభిమానుల గుండెల్లో ‘మహర్షి’. మాస్కు ‘పోకిరి’, క్లాస్కు ‘మురారి’. నిర్మాతల పాలిట ‘శ్రీమంతుడు’.. అవసరమైన వారికి సాయం చేస్తూ అండగా నిలిచే కనిపించని ఒక ‘నిజం’. అందుకే ఆయన అందరి అభిమాన నటుడయ్యారు. మహేశ్ హీరో అన్నది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు తిప్పి చూస్తే.. అదే ఈ కథనం. అభిమానుల మనసుకు దగ్గరగా.. విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే మహేశ్బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘నాని’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
నిజమైన ఫ్యామిలీమ్యాన్
తనయుడిగా.. వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. ఈ విషయంలో మహేశ్బాబు టాప్లో ఉంటారు. నంబవర్‘వన్’ స్థానానికి చేరుకోవడం ఒక ఎత్తయితే.. అగ్రపీఠాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. సూపర్స్టార్ కృష్ణ తనయుడిగా సినిమాల్లోకి వచ్చి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నార మహేశ్. మంచి కథ దొరికితే తన తండ్రి కృష్ణతో ఒక సినిమా చేయాలని ఉందని ఆయనో సందర్భంలో చెప్పారు. తన తండ్రి చేసిన సినిమాలను రీమేక్ చేసే సాహసం చేయబోనని, ‘అల్లూరి సీతారామరాజు’, ‘అగ్ని పర్వతం’ తన ఆల్టైమ్ ఫేవరెట్ సినిమాలంటారు.
భర్తగా.. తన తండ్రి తర్వాత అంతమంచి విమర్శకురాలు తన భార్య నమ్రత అంటారు మహేశ్. ఆమె తన జీవితంలోకి రావడం అదృష్టమని చెబుతారు. బయట ఎన్ని టెన్షన్లున్నా ఇంటికి వస్తే అవన్నీ పోతాయట. ఇంట్లో ఆనందంగా ఉంటేనే బయట కూడా ఆనందంగా ఉండగలం.. అందుకే నమ్రత వచ్చాక జీవితమే మారిపోయిందంటుంటారు.
తండ్రిగా.. తండ్రి అయ్యాకే ప్రతి మగాడిలోనూ పరిపక్వత వస్తుందని.. తనలోనూ గౌతమ్ ఈ భూమ్మీద అడుగుపెట్టిన తర్వాతే ఎంతో మార్పు వచ్చిందని మహేశ్ అంటారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లలు, కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. గౌతమ్, సితారతో కలిసి మహేశ్ చిన్న పిల్లాడిలా మారి వీడియో గేమ్స్ అడుతుంటారు.
సమాజ సేవలో ‘సైనికుడు’..
నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. వ్యక్తిగా అంతే మంచి పేరు తెచ్చుకున్నారు మహేశ్బాబు. హుదుద్ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.2.5 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికులకు కోసం రూ.25 లక్షలు అందజేశారు. #MBForSavingHearts పేరుతో వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. చేయిస్తూనే ఉన్నారు. కరోనాపై పోరాడేందుకు తెలుగు రాష్ట్రాలకు మహేశ్బాబు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. గుంటూరులోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయించారు. ఇటీవల వ్యాక్సిన్లు కూడా వేయించారు. మహబూబ్నగర్లోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు.
సమాజంపై బాధ్యత.. మద్యపానం, ధూమపానం సన్నివేశాలకు నో..
‘‘కొంతకాలం క్రితం వరకు సిగరెట్ తాగేవాడిని. అలాన్ కార్ రాసిన ‘ది ఈజీ వేటూ స్టాప్ స్మోకింగ్’ పుస్తకం చదివాను. రోజులు కనీసం వంద సిగరెట్లు తాగే అలవాటు ఉన్న అలాన్ మానేయగా లేనిది నేను మానేయలేనా అనుకొని మానేశాను. నిజానికి స్మోకింగ్ చాలా ప్రమాదకరం అందుకే నా సినిమాల్లో పొగతాగే సన్నివేశాలు చేయను’’ అని మహేశ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ప్రొడ్యూసర్లకు భారం కాకూడదని విడిరోజుల్లోనే కాదు, షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనూ మహేశ్ తన ఫ్యామిలీ ట్రావెల్, అసిస్టెంట్ల జీతాలు.. ఖర్చులు, అన్నీ ఆయన భరిస్తారు.
అందుకే ట్విటర్లోకి..
‘‘తర్వాతి సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి చాలామంది అభిమానంతో అడుగుతుంటారు. వాటికి సంబంధించి కొన్ని వెబ్సైట్లలో తప్పుడు వార్తలు వస్తుంటాయి. ఆ గందరగోళం పోగొట్టాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ‘ట్విటర్’ తట్టింది. అందుకే.. ట్విటర్లోనే నా గురించి, నా సినిమాల గురించి అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకొని ట్విటర్లోకి వచ్చాను’’ అని మహేశ్ ఓ సందర్భంలో వివరించారు. ప్రస్తుతం ట్విటర్లో మహేశ్బాబుకు 11.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. మహేశ్ జన్మదినం సందర్భంగా ట్విటర్లో 100 మిలియన్ల ట్వీట్లతో అభిమానులు రికార్డు సృష్టించారు.
మరిన్ని విషయాలు..
* వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారిని గౌరవించే మేడమ్ టుస్సాడ్స్లో మహేశ్బాబు మైనపు విగ్రహం చోటు దక్కించుకుంది.
* మహేశ్బాబు డజనుకుపైగా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. కేవలం ప్రైవేటు సంస్థలకే కాదు. ‘హీల్ ఏ చైల్డ్’ అనే స్వచ్ఛంద సంస్థకు కూడా గుడ్విల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
* 2013లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్గా మహేశ్ నిలిచారు.
* సినిమా విషయంలోనూ ప్రేక్షకులను అలరించడంతో పాటు నిర్మాతలకు లాభం తెచ్చిపెట్టే కమర్షియల్ సినిమాలే చేస్తూ నిర్మాతల హీరో అనిపించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?