Mahesh babu: ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ వచ్చేసింది!

ఎంతోకాలంగా ఆశగా ఎదురు చూస్తున్న మహేశ్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా

Updated : 31 Jul 2021 16:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎంతోకాలంగా ఆశగా ఎదురు చూస్తున్న మహేశ్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. శనివారం ఈ చిత్రానికి సంబంధించి ‘ఫస్ట్‌ నోటీస్‌’ అంటూ ఈ సినిమాలోని మహేశ్‌లుక్‌ను పంచుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా మహేశ్‌లుక్ అలరిస్తోంది. పొడవాటి జుట్టు, మెడపై రూపాయి కాయిన్‌ టాటూతో ఎరుపు రంగు కారులోని నుంచి మహేశ్‌ స్టైల్‌గా దిగుతున్న ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అవుతోంది. కారు వెనుక బైక్‌లపై రేసర్లు కనిపిస్తున్నారు. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను పరుశురామ్‌ తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘సర్కారువారి పాట’చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని