karthi: దిల్లీ వెళ్లినా ‘ఢిల్లీ’ గురించి అడుగుతున్నారు.. ‘సర్దార్’ ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు!
కార్తి కథానాయకుడిగా నటించిన ‘సర్దార్’ అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..
‘సర్దార్’లో ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారని, ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది తమ అలవాట్లు మార్చుకుంటారని కథానాయకుడు కార్తి అన్నారు. ఆయన కీలక పాత్రలో పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. రాశిఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కార్తి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘సర్దార్’ యథార్ధ సంఘటనల స్ఫూర్తి ఆధారంగా ఉంటుందా?
కార్తి: సర్దార్ పాత్ర రియల్ క్యారెక్టర్ స్ఫూర్తితో డిజైన్ చేశారు. ఇక్కడ పుట్టిన ఒక రంగస్థల నటుడు పాకిస్థాన్లో జనరల్గా పని చేశారు. దీని స్ఫూర్తిగా సర్దార్ కథని రాశారు. ఇందులో తండ్రీ-కొడుకుల పాత్రల్లో కనిపిస్తా. 60ఏళ్ల వ్యక్తిగా కనిపించడానికి చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. గెటప్ వేసుకుంటే వృద్ధుడిలా కనిపించవచ్చు. కానీ, ‘సర్దార్’ యాక్షన్ కూడా చేయాలి. అందుకు తగినట్లుగా సిద్ధమయ్యా. ‘ఖైదీ’ చేసినప్పుడు ఒక హాలీవుడ్ సినిమాకి దీటుగా ఉండాలని తీశాం. ఈ సినిమాకు కూడా అలాగే పనిచేశాం. కెమెరామెన్ జార్జ్ కొత్త ప్రపంచం చూపించారు. 1980ల నాటి కాలాన్ని సృష్టించారు.
‘పొన్నియిన్ సెల్వన్’తో విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘సర్దార్’తో వస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?
కార్తి: ‘పొన్నియిన్ సెల్వన్’ ఈ ఏడాది వేసవికి రావాలి. ఆలస్యమైంది. ఇప్పుడు ‘సర్దార్’ ఇండియన్ స్పై థ్రిల్లర్గా వస్తోంది. ఒక గ్రామంలో పెరిగిన రంగస్థల నటుడు గూఢచారిగా మారి ఏం చేశాడనేది దర్శకుడు మిత్రన్ అద్భుతంగా చూపించారు. ట్రైలర్లో ఒక ఫైల్ మిస్సింగ్ గురించి చూపించాం కదా.. అందులో మనం బ్రతకడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ కథ వినకముందు దాని గురించి ఆలోచన లేదు. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని మామూలు అలవాట్లు మార్చుకుంటారనే నమ్మకం ఉంది.
‘సర్దార్’కు పాన్ ఇండియా సినిమా అవకాశం ఉంది కదా!
కార్తి: అవును. ఒక వారం తర్వాత బాలీవుడ్లోనూ విడుదల చేస్తాం. సర్దార్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. నిజానికి ప్రేక్షకులు ఇచ్చిన నమ్మకంతోనే ఇలాంటి భారీ సినిమాలు చేస్తున్నాను. కాష్మోరా, ఖాకీ, ఖైదీ, పొన్నియిన్ సెల్వన్ ఇలా అన్నీ చిత్రాలని ఆదరిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో వైవిధ్యమైన సినిమాలు చేయాలనే ఉత్సాహం వస్తోంది.
తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?
కార్తి: కొన్ని కథలు వింటున్నాను. నిజానికి తెలుగును వేరే పరిశ్రమ అనుకోను. ఇది నా సొంత ఇల్లు. అమ్మ ఇంటి నుండి పిన్ని ఇంటికి వచ్చినట్లే ఉంటుంది. (నవ్వుతూ) తెలుగులో ‘సర్దార్’ నాగార్జున అన్నయ్య విడుదల చేస్తున్నారు. సినిమాకి కావాల్సిన అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటా. ఇక దర్శకుడు పీఎస్ మిత్రన్ది మంచి వ్యక్తిత్వం. దర్శకుడిగా ఒక బలమైన విషయాన్ని సమాజానికి చెప్పాలి చూపించాలనే ఆయన తపన నాకు నచ్చింది.
దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి? ఎలాంటి పోటీ ఉంటుందని భావిస్తున్నారు?
కార్తి: గతంలో పది సినిమాలు కూడా వచ్చాయి. (నవ్వుతూ). పోటీ అంటూ ఏమీ ఉండదు. సినిమా బాగుంటే కచ్చితంగా చూస్తారని నమ్ముతా
‘ఖైదీ2’ ఎప్పుడు?
కార్తి: దిల్లీ వెళ్ళినా ఢిల్లీ గురించి అడుగుతున్నారు( నవ్వుతూ). విక్రమ్ తర్వాత దీనికి పై మరిన్ని అంచనాలు పెరిగాయి. త్వరలోనే చేస్తాం. ఆ వివరాలు కూడా చెబుతా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.