Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్‌, ‘ఆదిపురుష్‌’ టీమ్‌

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ‘ఆదిపురుష్‌’ చిత్ర బృందంతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన.. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Updated : 06 Jun 2023 09:39 IST

తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ‘ఆదిపురుష్‌’ చిత్ర బృందంతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన.. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్‌కు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. 

తిరుపతిలో నేడు జరగనున్న ‘ఆదిపురుష్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌ పాల్గొననున్నారు. ప్రభాస్‌ రాకతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు తిరుమల చేరుకున్నారు. అభిమానులను నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని