Sree Vishnu:ఇప్పటి నుంచిఅదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు: శ్రీవిష్ణు
శ్రీవిష్ణు చెప్పిన అర్జున ఫల్గుణ చిత్ర ముచ్చట్లు ఇవే! అందులో ప్రధానంగా అవే ఆకట్టుకుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ ప్రారంభించాడు.. సినిమాల మీద ఉన్న ఆసక్తితో వెబ్ డిజైనర్ జాబ్ వదులుకున్నాడు.. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘బ్రోచేవారెవరురా’తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతడే ‘శ్రీవిష్ణు’. ఈ ఏడాది రెండు చిత్రాలు ‘గాలి సంపత్’, ‘రాజ రాజ చోర’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. డిసెంబర్ 31న ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఆ చిత్ర విశేషాలను మీడియాతో ముచ్చటించాడు.
అందుకే ‘అర్జున ఫల్గుణ’ చేయడానికి ఒప్పుకున్నా..
ఈ ఏడాదిలో వస్తున్న నా మూడో చిత్రం ఇది. ఇప్పటి వరకు కొత్త దర్శకులతోనే పనిచేశా. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటా. మొదటి సారి దర్శకుడు తేజ మర్ని కథ చెప్పినప్పుడు సినిమా బాగా తెరకెక్కించగలడన్న నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ హత్తుకునేలా రాశారు. వాస్తవానికి భావోద్వేగాలను బాగా చూపించగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమా ఓకే చేశా. చాలా తక్కువ సమయంలో (55 రోజుల్లో) షూటింగ్ పూర్తి చేసి తేజ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి అలా చేయడం చాలా కష్టం. కచ్చితంగా తేజ పెద్ద డైరెక్టర్ అవుతారు.
అలా ఈ సినిమా పేరు పెట్టాం..
‘అర్జున ఫల్గుణ’ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ.. ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటే ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది ‘అర్జున ఫల్గుణ’ వరకే ఉండిపోయింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు వస్తే అందరూ ‘అర్జున ఫల్గుణ’ అని అనుకోమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా ‘అర్జున ఫల్గుణ’ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందుగా వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒకరోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది.
చాలా ఫ్రెష్గా అనిపించింది..
దర్శకుడు తేజని కలిసినప్పుడు తన తొలి చిత్రం ‘జోహార్’ సినిమా ఇంకా రాలేదు. ‘ఆర్టాస్’ అనే కూల్ డ్రింక్ అనే పాయింట్ కేవలం తూర్పు, పశ్చిమ గోదావరి వాళ్లకు మాత్రమే తెలుసు. నాకు ఇంకా అవి గుర్తున్నాయి. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్లో కథ చేయాలని అనుకున్నా. ఊరి బ్యాక్ డ్రాప్లోంచి సిటీకి వచ్చిన కథలు చేశా. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్గా అనిపించింది. పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పా.
ఐదుగురు స్నేహితుల కథ..
మేం ఐదుగురం ఫ్రెండ్స్. ఆ పేర్లలో ఫస్ట్ లెటర్స్తో ‘ఆర్టాస్’ అని వస్తుంది. ఇంతకు ముందు అయితే ఆర్టాస్ కూల్డ్రింక్ కంపెనీలో పని చేసే కుర్రాళ్ల కథ. కానీ అది కుదరలేదు. అందుకే సోడా మీదకు కథ మార్చేశాం. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం.
వెటకారం మాములుగా ఉండదు..
ఇది వరకు చాలా సినిమాల్లో గోదావరి యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా వెటకారంగా ఉంటుంది.
అందుకే ఫీమేల్ కారెక్టర్ను స్ట్రాంగ్గా చూపిస్తా..
ట్రైలర్లో గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది. అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించింది. నా ప్రతి సినిమాల్లో ఫీమేల్ కారెక్టర్ను స్ట్రాంగ్గా చూపిస్తా. ఇందులో కూడా అలానే ఉంటుంది. మా ఐదుగురిలో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందన్న కడుపు మంటతో అలా మాట్లాడతారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని అనిపించినా.. నేనే ముందుగా సీన్లు తీసేయమని అంటా.
ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం...
తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తా. అందరినీ ఇష్టపడతా. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ గొప్పగా చూస్తుంటా. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే దాన్ని వాడుకుంటా. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్గా ఉంటుంది.
ఆ సీన్లు అద్భుతంగా వచ్చాయి..
మన దగ్గర అనుమతులు త్వరగా రాదని ట్రైన్ ఎపిసోడ్ కోసం ఒడిశా వెళ్లాం. రెండు రోజుల వరకే షూటింగ్ చేసుకుంటామంటే ఇచ్చింది ఒక రోజే. అందులోనూ కరెక్ట్గా రెండున్నర గంటలే దొరికింది. అందులోనూ మేం గట్టిగా వాడింది గంటన్నర మాత్రమే. చాలా కష్టపడి సీన్లు తీసేశాం. బ్రిడ్జ్ దగ్గర సీన్లు అద్భుతంగా వచ్చాయి. బ్రిడ్జ్ దగ్గర పరిగెత్తే సీన్లలో కిందకు మాత్రం చూడొద్దన్నారు. కానీ మధ్యలోకి వెళ్లాక చూశాను. ఒక్కసారిగా భయమేసింది.
అదేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు..
తెలుగు టైటిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. టైటిల్స్ అన్నీ తెలుగులో పెట్టేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటా. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటా. ఈ తరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ‘అర్జున ఫల్గుణ’లో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్ధతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ‘ముల్కల లంక’ అనే ఊర్లోకి వెళ్తారు. నేను, ‘రంగస్థలం’ మహేశ్, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో చైతన్య, ‘రాజవారు రాణివారు’లో చౌదరి అనే అబ్బాయి, అమృత.. మా ఐదుగురు చుట్టూ కథ తిరుగుతుంది. మా అందరి పాత్రలు సమానంగా ఉంటాయి. నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు.. ఇలా ఎవరి పాత్ర ఎవరికి వారు అద్భుతంగా చేశారు. బహుశా దర్శకుడు తేజ ఎవరి దగ్గరికి వెళ్లినా నువ్వే హీరో అని కథ చెప్పి ఉంటాడు (నవ్వులు). అందుకే వాళ్లకి వాళ్లు హీరోగా అనుకొని సినిమాల్లో ఇరగదీశారు.
అవే నా బలం..
రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతి కథనూ రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తా. నా సినిమాలన్నీ నేచురల్గా ఉంటాయని అందరూ అంటుంటారు. రియలిస్టిక్ కథలే నా బలం.
కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటా..
సినిమాల్లో పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటా. ‘తిప్పరా మీసం’ సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్తో ఆ సినిమా చేశా. అంతకు ముందే ‘బ్రోచేవారెవరురా’ అంటూ ఫుల్ కామెడీ సినిమా చేశా. అందుకే ‘తిప్పరా మీసం’ కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రం. ప్రియదర్శన్ అనే కొత్త అబ్బాయి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సుధీర్ రాసిన డైలాగ్స్ ఎంతో రియలిస్టిక్గా అనిపిస్తాయి. డైలాగ్స్ రాసినట్టు ఎక్కడా అనిపించవు.
పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు..
కరోనా సమయంలోనే థియేటర్లలో ‘రాజ రాజ చోర’ కూడా విడుదల చేశాం. ఒమిక్రాన్ వస్తుందంటే మనం ఏం చెప్పలేం. ఇక పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు. మాకు కనీసం ఓ వారం సోలోగా దొరికిందని సంతోషంగా ఉన్నాం. కొత్త ఏడాదిని ఇలా పాజిటివ్ సినిమాతో ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. ఇది కరెక్ట్ సీజన్. ముందు డిసెంబర్ మొదటి రెండు వారాల్లో అనుకున్నాం. కానీ చివరకు ఇలా డిసెంబర్ 31న వస్తున్నాం.
అదేంటో ఇప్పటికీ అలా చేయడమంటే సిగ్గు..
నాలో అపరిచితుడు ఉన్నాడు. మంచి కథను చెప్పి షూటింగ్ స్పాట్లో యాక్షన్ అన్నారంటే అప్పుడొస్తాడు (నవ్వులు). బయటలా రిజర్డ్వ్గా ఉన్నట్టు అనిపించినా సెట్లో మాత్రం జోవియల్గా ఉంటా. అందులో నా స్వార్థం కూడా ఉంది. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. అలవాటైతే మాత్రం ఫ్రెండ్లీగా ఉంటా. అందరూ ఒకరకంగా పాజిటివ్గా అనుకుంటే మరికొంత మంది నెగెటివ్ అనుకుంటారు. ఇప్పటికీ నాకు కెమెరాల ముందు ఫొటోల ముందు పోజులు ఇవ్వాలంటే సిగ్గు (నవ్వులు). చిన్నప్పటి నుంచి నాకు మొహమాటం ఎక్కువ. సాధారణంగా ఇండస్ట్రీకి వస్తే మొహమాటం పోతుందంటారు నాకు మాత్రం ఇంకా పోలేదు.
ఇవే తదుపరి చిత్రాలు..
‘భళా తందనానా’ అనే చిత్రం చేస్తున్నా. లక్కీ మీడియాలో ప్రదీప్ వర్మ అనే కొత్త డైరెక్టర్తో మరో సినిమా చేస్తున్నా. ఇది ఓ పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఇండియాలోని నలుగురైదుగురు ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఎపిసోడ్స్ని తీసుకొని ఫిక్షనల్ బయోపిక్లా తీస్తున్నాం. అందులో ఐదు ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. ఇంతకంటే ఈ సినిమాల గురించి ఎక్కువగా ఏమీ చెప్పలేను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.
తాజా వార్తలు (Latest News)
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి