గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే!
వేగంగా దూసుకెళ్తోన్న వాహనం మార్గమధ్యంలో ఏదైనా అడ్డొస్తే నెమ్మదిగా వెళ్తుంది. కొంతసమయం తీసుకుని మళ్లీ అదే స్థాయిలో
వేగంగా దూసుకెళ్తోన్న వాహనం మార్గమధ్యంలో ఏదైనా అడ్డొస్తే నెమ్మదిగా వెళ్తుంది. కొంతసమయం తీసుకుని మళ్లీ అదే స్థాయిలో దూసుకెళ్తుంది. కొందరు కథానాయికల విషయంలోనూ ఇంతే. కెరీర్ ప్రారంభంలో జోరు చూపించి ఏవేవో కారణాల వల్ల కాస్త తెరమరుగవుతారు. విరామం తీసుకున్నా.. కొన్నాళ్లకు పూర్వ వైభవం అందుకుంటారు. ఓ వైపు ప్రధాన పాత్ర.. మరో వైపు అతిథి పాత్ర చేస్తూ ఆశ్చర్యంలో పడేస్తారు. ఈ జాబితాలో నిలిచిన ప్రియమణి, శ్రియ, పూర్ణ, శ్రుతిహాసన్ సినీ కెరీర్ను పరిశీలిస్తే...
అటు బాబాయ్తో.. ఇటు అబ్బాయ్తో
‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ప్రియమణి. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ పరిశ్రల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 2016లో వచ్చిన ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె మరే తెలుగు సినిమాలో కనిపించలేదు. అలాంటిది ఆమె చేతిలో ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వెంకటేష్ కథానాయకుడుగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ‘నారప్ప’లో ప్రియమణి నాయికగా అవకాశం చేజిక్కించుకుంది. దీంతోపాటు రానా హీరోగా వేణు ఊడుగుల రూపొందిస్తున్న ‘విరాటపర్వం’లో కామ్రేడ్ భారతక్కగా నటిస్తోంది.
సరికొత్త ‘గమనం’
శ్రియ శరన్ తెలుగు తెరతోనే నాయికగా మెరిసింది. తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ పేరు సంపాదించింది. తొలినాళ్లలో వరుసగా తెలుగు సినిమాల్లో కనిపించిన శ్రియ 2018లో వచ్చిన ‘గాయత్రి’ తర్వాత ఇప్పటి వరకు దర్శనమివ్వలేదు. 2019లో ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంలోని ఓ గీతంలో నర్తించి ఆకట్టుకుంది. ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. సుజనా రావు తెరకెక్కిస్తున్న ‘గమనం’లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతుందీ చిత్రం. భారీ అంచనాల నడుమ రాజమౌళి రూపొందిస్తున్న ‘రౌద్రం రుధిరం రణం (ఆర్ఆర్ఆర్)’లో కీలక పాత్ర పోషిస్తోంది.
పెద్ద చిత్రాల్లో తొలిసారి
అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించకపోయినా ప్రేక్షకుల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. కోలీవుడ్, మాలీవుడ్, సాండిల్వుడ్లలోనూ తన ప్రతిభ చూపింది. 2019లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ తర్వాత పూర్ణ టాలీవుడ్లో సందడి చేయలేదు. ఇప్పుడు వరస అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిలో పడింది. పూర్ణ ప్రధాన పాత్రధారిగా ‘బ్యాక్డోర్’, ‘సుందరి’ తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రాబోతున్న ‘తలైవి’లో ఓ ముఖ్య పాత్ర భూమిక పోషిస్తుంది. ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. ఇవే కాదు బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో ఓ నాయికగా ఎంపికైందని సమాచారం.
మరోసారి ‘శ్రుతి’ కలిపింది
ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా తెరంగ్రేటం చేసింది శ్రుతి హాసన్. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మంచి విజయం అందుకుంది. టాలీవుడ్ అగ్ర నాయకుల పక్కన ఆడిపాడిన ఈ భామ కొంత విరామం తీసుకుంది. 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ తర్వాత శ్రుతి తెలుగు సినిమా చేయలేదు. ఆ లోటును భర్తీ చేసేందుకు గతంలో నటించిన ఇద్దరు సీనియర్ హీరోలతో మళ్లీ చేయి కలిపింది. అందులో ఒకటి రవితేజ్ నటిస్తోన్న ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మరొకటి ‘వకీల్ సాబ్’. పవన్ కల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు.
చిత్రసీమలో విజయానికే ప్రామాణికం. అలాంటిది ఈ నాయికలు తెలుగులో నటించిన చివరి చిత్రం ఆశించినంత విజయం సాధించకపోయినా... సుదీర్ఘ విరామం తీసుకున్నా.. ప్రతిష్టాత్మక చిత్రాల్లో అవకాశం దక్కించుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్