Hit 2: ‘హిట్ 2’ కథతో శేష్ వద్దకు వెళ్లొద్దన్నారు
‘‘హిట్1’ ప్రశ్నలతో థ్రిల్ చేస్తే.. ‘హిట్2’ భయపెట్టి థ్రిల్ చేస్తుంద’’న్నారు అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘హిట్ ’. ది సెకండ్ కేస్.. అన్నది ఉపశీర్షిక.
‘‘హిట్1’ ప్రశ్నలతో థ్రిల్ చేస్తే.. ‘హిట్2’ (HIT 2) భయపెట్టి థ్రిల్ చేస్తుంద’’న్నారు అడివి శేష్ (Adivi Sesh). ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘హిట్ ’. ది సెకండ్ కేస్.. అన్నది ఉపశీర్షిక. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘నాకిష్టమైన హీరో నాని. ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాల ట్రైలర్స్ను తనే విడుదల చేశారు. ఓరోజు సడెన్గా వచ్చి నాతో ఒక హిట్ సినిమా నిర్మిస్తానన్నారు. అలా ‘హిట్2’ నా దగ్గరకు వచ్చింది. ఈ సినిమా చేయడానికి కొవిడ్ టైమ్లో చిత్ర బృందమంతా చాలా కష్టపడింది. చాలా గర్వంగా ఫీలవుతున్నా. సినిమా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు. టీజర్ చూడగానే విలన్ వాయిస్ బాగా నచ్చింది. హిట్ వెర్స్లో విభిన్నమైన కోణాలున్నాయి. అందుకనే ‘హిట్2’లో నటించాను. ఇందులో శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. మీనాక్షి చక్కటి ప్రతిభ ఉన్న నటి. బాంబే అమ్మాయిల్లా ‘హాయ్ నమస్కారం వన్..టు..త్రీ..’ అని చెప్పేసి కారవాన్ ఎక్కేసి వెళ్లిపోతుందనుకున్నా. కానీ, తను నమస్కారం చెప్పడంతో పాటు చాలా వరకు స్పీచ్ తెలుగులో నేర్చుకొని మరీ మాట్లాడింది. టీజర్ రిలీజ్కే ఇంత కష్టపడిందంటే.. సినిమా కోసం తనెంత కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘ఈ కథతో శేష్ దగ్గరకు వెళ్దామనుకుంటే ‘వెళ్లొద్దు.. మనోడు వేలుపెడతాడు. అన్నీ తనే రాసేసుకుంటాడు’ అన్నారు. దాంతో తొలి మీటింగ్ అప్పుడు కథ తనకి నచ్చుతుందా లేదా? అనుకున్నా. కానీ, తనకు కథ బాగా నచ్చింది. సెట్స్లో తనెంతో ప్రొఫెషనల్గా ఉండేవాడు. కె.డి. అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని అనుకున్నానో.. దానికంటే నాలుగైదు రెట్లు బాగానే చేసి చూపించాడు. హిట్ వెర్సెకి వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యమేసింది. ఈ హిట్ యూనివర్స్ని ఇంకా గొప్పగా చేయాలనే స్ఫూర్తిని ఇచ్చింది’’ అన్నారు దర్శకుడు శైలేష్ కొలను. నిర్మాత ప్రశాంతి మాట్లాడుతూ.. ‘‘హిట్2’ని తెరపై చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను ఆర్య అనే పాత్రలో నటించా. శైలేష్ ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నా’’ అంది నాయిక మీనాక్షి. ఈ కార్యక్రమంలో కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, మణికందన్, గ్యారీ బి.హెచ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె