Hit 2: ‘హిట్ 2’ కథతో శేష్ వద్దకు వెళ్లొద్దన్నారు
‘‘హిట్1’ ప్రశ్నలతో థ్రిల్ చేస్తే.. ‘హిట్2’ భయపెట్టి థ్రిల్ చేస్తుంద’’న్నారు అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘హిట్ ’. ది సెకండ్ కేస్.. అన్నది ఉపశీర్షిక.
‘‘హిట్1’ ప్రశ్నలతో థ్రిల్ చేస్తే.. ‘హిట్2’ (HIT 2) భయపెట్టి థ్రిల్ చేస్తుంద’’న్నారు అడివి శేష్ (Adivi Sesh). ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘హిట్ ’. ది సెకండ్ కేస్.. అన్నది ఉపశీర్షిక. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘నాకిష్టమైన హీరో నాని. ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాల ట్రైలర్స్ను తనే విడుదల చేశారు. ఓరోజు సడెన్గా వచ్చి నాతో ఒక హిట్ సినిమా నిర్మిస్తానన్నారు. అలా ‘హిట్2’ నా దగ్గరకు వచ్చింది. ఈ సినిమా చేయడానికి కొవిడ్ టైమ్లో చిత్ర బృందమంతా చాలా కష్టపడింది. చాలా గర్వంగా ఫీలవుతున్నా. సినిమా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు. టీజర్ చూడగానే విలన్ వాయిస్ బాగా నచ్చింది. హిట్ వెర్స్లో విభిన్నమైన కోణాలున్నాయి. అందుకనే ‘హిట్2’లో నటించాను. ఇందులో శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. మీనాక్షి చక్కటి ప్రతిభ ఉన్న నటి. బాంబే అమ్మాయిల్లా ‘హాయ్ నమస్కారం వన్..టు..త్రీ..’ అని చెప్పేసి కారవాన్ ఎక్కేసి వెళ్లిపోతుందనుకున్నా. కానీ, తను నమస్కారం చెప్పడంతో పాటు చాలా వరకు స్పీచ్ తెలుగులో నేర్చుకొని మరీ మాట్లాడింది. టీజర్ రిలీజ్కే ఇంత కష్టపడిందంటే.. సినిమా కోసం తనెంత కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘ఈ కథతో శేష్ దగ్గరకు వెళ్దామనుకుంటే ‘వెళ్లొద్దు.. మనోడు వేలుపెడతాడు. అన్నీ తనే రాసేసుకుంటాడు’ అన్నారు. దాంతో తొలి మీటింగ్ అప్పుడు కథ తనకి నచ్చుతుందా లేదా? అనుకున్నా. కానీ, తనకు కథ బాగా నచ్చింది. సెట్స్లో తనెంతో ప్రొఫెషనల్గా ఉండేవాడు. కె.డి. అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని అనుకున్నానో.. దానికంటే నాలుగైదు రెట్లు బాగానే చేసి చూపించాడు. హిట్ వెర్సెకి వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యమేసింది. ఈ హిట్ యూనివర్స్ని ఇంకా గొప్పగా చేయాలనే స్ఫూర్తిని ఇచ్చింది’’ అన్నారు దర్శకుడు శైలేష్ కొలను. నిర్మాత ప్రశాంతి మాట్లాడుతూ.. ‘‘హిట్2’ని తెరపై చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను ఆర్య అనే పాత్రలో నటించా. శైలేష్ ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నా’’ అంది నాయిక మీనాక్షి. ఈ కార్యక్రమంలో కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, మణికందన్, గ్యారీ బి.హెచ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!