Keerthy Suresh: ‘కేజీయఫ్‌’ నిర్మాణ సంస్థతో కీర్తి సురేశ్‌.. తిరుగుబాటు దేనికోసం?

కీర్తి సురేశ్‌ మరో నాయికా ప్రాధాన్య చిత్రంలో నటించనుంది. దాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించనుంది.

Published : 04 Dec 2022 20:10 IST

చెన్నై: ‘కేజీయఫ్‌’ పార్ట్‌ 1, 2 సినిమాలతో విశేష గుర్తింపు పొందిన సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ (Hombale Films). ఇప్పుడీ నిర్మాణ సంస్థ ఓ నాయికా ప్రాధాన్య చిత్రానికి శ్రీకారం చుట్టింది. దాని కోసం ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh)ను ఎంపిక చేసినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఓవైపు రైల్వే ట్రాక్‌, మరోవైపు గోడ, తాటిచెట్లు కనిపించాయి. ఈ రెండింటి మధ్య కీర్తి సురేశ్‌ లుక్‌ని తీర్చిదిద్దారు. చేయి పైకెత్తి, పిడికిలి బిగించి ఉన్నట్టు కనిపించింది కీర్తి. దీన్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ‘రఘు తాత’ (Raghu Thatha) అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. విజయ్‌ కిరంగదూర్‌ నిర్మాత. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తొలి తమిళ సినిమా ఇదే. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. ప్రస్తుతం.. తెలుగులో నాని సరసన ‘దసరా’లో నటిస్తోన్న కీర్తి.. ‘భోళా శంకర్‌’లో చిరంజీవికి సోదరిగా కనిపించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని