Hush Hush: మిస్టరీ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌: హుష్‌.. హుష్‌.. ట్రైలర్‌ చూశారా?

రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు పలు ఆసక్తికర ప్రాజెక్టులను

Published : 13 Sep 2022 15:16 IST

హైదరాబాద్‌: రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు పలు ఆసక్తికర ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మరో సరికొత్త వెబ్‌సిరీస్‌లో పలకరించనుంది. జుహీ చావ్లా, సోహా అలీఖాన్‌, షహన్‌ గోస్వామి, కృతిక కమ్రా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్‌ ‘హుష్‌ హుష్‌’. తనుజా చంద్ర, కోపాల్‌ నైతని, అశిష్‌ పాండేలు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ సెప్టెంబరు 22న నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో మంగళవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సిరీస్‌ సాగనున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని