సినిమా కోసం అధికార దుర్వినియోగం చేయలేదు..

తన తనయుడి సినిమా చిత్రీకరణ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని ఎంపీ, ప్రముఖ నటి సుమలత అన్నారు. అంబరిష్‌-సుమలత దంపతుల కుమారుడిగా వెండితెరకు పరిచయమై కన్నడ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు...

Published : 24 Jan 2021 01:27 IST

విమర్శలపై సమాధానమిచ్చిన సుమలత

బెంగళూరు: తన తనయుడి సినిమా చిత్రీకరణ కోసం అధికార దుర్వినియోగం చేయలేదని ఎంపీ, ప్రముఖ నటి సుమలత అన్నారు. అంబరిష్‌-సుమలత దంపతుల కుమారుడిగా వెండితెరకు పరిచయమై కన్నడ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అభిషేక్‌. ప్రస్తుతం అభిషేక్‌ తన రెండో సినిమా ‘బ్యాడ్‌ మ్యానర్స్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ మండ్యాలోని మైషుగర్‌ ఫ్యాక్టరీలో జరుగుతోంది. కొంతకాలంగా మూసి ఉన్న ఈ ఫ్యాక్టరీలో సినిమా షూట్‌ నిర్వహించడం పట్ల స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ సుమలత కారణంగానే మూసివున్న ఫ్యాక్టరీలో చిత్రీకరణకు అవకాశమిచ్చారంటూ పలువురు విమర్శలు చేశారు.

వీటిపై తాజాగా సుమలత స్పందించారు. ‘బ్యాడ్‌ మ్యానర్‌’ చిత్రీకరణ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని అన్నారు. ‘ఇలాంటి నిరాధర ఆరోపణలు ఎలా చేస్తారో నాకు అర్థం కావడం లేదు. షుగర్‌ ఫ్యాక్టరీలో షూట్‌ చేస్తున్నారనే విషయం నాకు తాజాగా తెలిసింది. ఫ్యాక్టరీలో షూట్‌ చేసుకునేందుకు కావాల్సిన అనుమతులను చిత్రబృందం ముందే జిల్లా యంత్రాంగం నుంచి తీసుకుంది. కాబట్టి నియమాలను ఉల్లంఘించారు అని చెప్పడానికి ఎలాంటి కారణాల్లేవు. స్థానిక ఆర్థిక వ్యవస్థను, పర్యాటకాన్ని సినిమా చిత్రీకరణలు మరింత వృద్ధి చేస్తాయి’ అని సుమలత వివరించారు.

ఇదీ చదవండి..

స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని