Rajamouli: నేనిప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా.. అలా తీస్తే సినిమా హిట్ కాదు: రాజమౌళి
‘ఆర్ఆర్ఆర్’కు హాలీవుడ్ ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి ఇంత గొప్ప ఆదరణ లభిస్తుందని తాను అనుకోలేదని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’కు హాలీవుడ్ ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి ఇంత గొప్ప ఆదరణ లభిస్తుందని తాను అనుకోలేదని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని, ఏకంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దర్శకుడు రాజమౌళి ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘‘బాహుబలి’కి జపాన్లో మంచి మైలేజ్ వచ్చింది. నేను ఎంచుకునే కథలు తెలుగు దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తాయని నాకు నమ్మకం ఉండేది. కానీ, దేశం దాటి వెళ్తాయని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ‘బాహుబలి’కి జపాన్లో వచ్చిన ఆదరణ చూసిన తర్వాతే నాకు నమ్మకం కలిగింది. తూర్పు దేశాల ప్రజలకు మన సినిమాలు నచ్చుతాయని అర్థమైంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ను పశ్చిమ దేశాల్లోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేయలేదు. కనీసం ఆ ఆలోచన కూడా లేదు. కానీ, సినిమా విడుదలైన తర్వాత నెమ్మదిగా అక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చిందన్న అభిప్రాయాలు రావడం మొదలయ్యాయి. ఏదో కొద్దిమందికి నచ్చిందేమో అనుకున్నా. నెమ్మదిగా ‘ఆర్ఆర్ఆర్’ను మెచ్చుకునే వారి సంఖ్య పదుల నుంచి వందలు, వందల నుంచి వేలకు పెరిగింది. హాలీవుడ్ రచయితలు, దర్శకులు, విమర్శకులు వివిధ రంగాలకు చెందిన ప్రజలు ‘ఆర్ఆర్ఆర్’ గురించి గొప్పగా మాట్లాడటం చూసి, ఇవన్నీ నా గురించి, నా సినిమాల గురించేనా? అని అనిపించింది’’
‘‘హాలీవుడ్ ప్రేక్షకులకు నా సినిమాలు నచ్చుతున్నాయి కదాని, నా ఆలోచన ధోరణి మార్చుకుని, నేను కూడా అలా సినిమాలు తీస్తే, అది సరిగా వర్కవుట్ కాకపోవచ్చు. కథను చెప్పే విధానంలో నాకంటూ ప్రత్యేకశైలి ఉంది. దాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. అంతేకానీ, పూర్తిగా నా శైలిని మార్చుకుని సినిమాలు తీయకూడదు. అలా చేస్తే, రెండు పడవలపై ప్రయాణం చేసినట్లే. నేను కథను చెప్పే విధానానికి కట్టుబడి ఉంటూనే, దాన్ని మరింత చక్కగా, మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా తీర్చిదిద్దాలి. ఇలా ఎన్ని రకాల మార్పులు, అదనపు హంగులు జోడించినా, అంతిమంగా అది కచ్చితంగా నా స్టోరీ అయి ఉండాలి. ‘ఇది రాజమౌళి స్టోరీ కాదే’ అనిపించకూడదు. కథ చెప్పే విషయంలో మీరు నన్ను మార్గ నిర్దేశకుడు అంటున్నారు. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేయటం మొదలు పెట్టాను. చూద్దాం.. ఇలాగే ముందుకు వెళ్తే, మరింత విజయవంతమైతే అప్పుడు మీరు అన్నది కరెక్ట్ అవుతుందేమో చూడాలి’’ అని రాజమౌళి అన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేశ్బాబు కథానాయకుడిగా రాజమౌళి ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి రెండు కథలు సిద్ధం చేసినట్లు రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పారు. అందులో ఒకటి అడవి నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీ కాగా, మరొకటి జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని టాక్. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ